దేశంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 16,135 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 4,35,18,564కు చేరాయి. ఇందులో 4,28,79,477 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.
5,25,223 మంది కరోనా మహమ్మారితో మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం దేశ వ్యాప్తంగా మరో 1,13,864 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 24 మంది మరణించారు. 13,958 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు.
గత కొన్నిరోజులుగా భారీసంఖ్యలో యాక్టివ్ కేసులు నమోదవుతుండటంతో 4.85 శాతానికి పెరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా యాక్టివ్ కేసులు 0.26 శాతం, రికవరీ రేటు 98.54 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 197.98 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.