ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 1,578 మంది కరోనా బారిన పడ్డారు. మరో 22 మంది మరణించారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,24,421కు చేరగా, మరణాల సంఖ్య 13,024కు పెరిగింది. కొత్తగా 3,041 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 18,84,202కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 27,195 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు
కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబు మళ్లీ తెలంగాణలోకి వస్తున్నారని రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని, తన మనషులకు కాంగ్రెస్లోకి పంపి రాష్ర్టంలో చంద్రబాబు అడుగు పెడుతున్నారని తెలిపారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే.. ఆంధ్రాబాబు అని చంద్రబాబును ప్రజలు తరిమేశారు అని గుర్తు చేశారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో తన వాళ్లకు …
Read More »రేవంత్ రెడ్డిపై ఆర్కే రోజా ఫైర్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీడీపీ కోవర్టుగా ఉన్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్కు చంద్రబాబు 28 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసిన విషయం రేవంత్కు గుర్తులేదా? అని ప్రశ్నించారు. తన ఇంటికి జగన్ ఎప్పుడూ రాలేదని ఇక కేసీఆర్తో మంతనాలు ఎలా జరుపుతారని రోజా అన్నారు. తన ఇంటికి జగన్ ఎప్పుడు వచ్చారో రేవంత్ చెప్పాలని రోజా అన్నారు. తెలుగుదేశం కోవర్టులా …
Read More »బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి కన్నుమూత
ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ చెన్నై అపోలో ఆస్పత్రిలో మృతి చెందగా.. ఆయన మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలియజేశారు. ‘రామచంద్రారెడ్డి సిద్ధాంతాలకు కట్టుబడిన నేత. ఆయనతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. రామచంద్రారెడ్డి కుటుంబసభ్యులకు నా సానుభూతి’ అని వెంకయ్యనాయుడు అన్నారు. అటు సోమువీర్రాజు కూడా సంతాపం తెలియజేశారు.
Read More »కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులు-సీఎం కేసీఆర్
కృష్ణా జలాలను వృథా చేస్తున్నామని ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని తెలంగాణ రాష్ట్ర సీఎం అన్నారు. పులిచింతల నుంచి విడుదలైన నీటిని ఏపీ వాడుకోవచ్చని.. తెలంగాణకు కేటాయించిన నీటితోనే విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్.. కాళేశ్వరంతో తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి గోస తీరిందని, రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల వల్ల జల విద్యుత్ అవసరం పెరిగిందన్నారు.
Read More »పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక ప్రాజెక్టు- సీఎం కేసీఆర్
కృష్ణా జలాల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. నీటి కేటాయింపులు లేకుండానే ఏపీ ప్రాజెక్టులు కడుతోందని.. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తోందని మండిపడ్డారు. ఎన్జీటీ స్టే విధించినా నిర్మాణాలను ఏపీ ఆపడం లేదని.. ఏపీ చేపట్టిన పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక ప్రాజెక్టు అని సీఎం తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఒప్పుకునేది లేదన్నారు.
Read More »TSRTC శుభవార్త
కరోనా కేసులు తగ్గడంతో తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేశారు. ఇన్నిరోజులు లాక్ డౌన్ కారణంగా కేవలం రాష్ట్రానికే పరిమితమైన ఆర్టీసీ సర్వీసులు తాజాగా లాక్ డౌన్ ఎత్తి వేయండంతో అంతరాష్ట్ర సర్వీసులను నేటి నుండి ప్రారంభించింది. ఈ రోజు ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రలకు బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా బస్సులను నడపనుంది. ఆంధ్రప్రదేశ్కు రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 …
Read More »విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు
ఈనెల 30వ తేదీ వరకు విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు వారాంతపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. * రైలు నంబరు 02449-02450 షాలిమార్-సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైలు 9, 16, 23, 30 తేదీల్లో షాలిమార్లో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.55కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 11, 18, 25, జులై 2వ తేదీల్లో ఇదే రైలు …
Read More »ఏపీలో కొత్తగా 10,373 కరోనా కేసులు
ఏపీలో గత 24 గంటల్లో 88,441 మందికి కరోనా టెస్టులు చేస్తే 10,373 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న 80 మంది కరోనాతో మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 17,49,363కు చేరగా ఇప్పటివరకు 11,376 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,28,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 15,958 మంది కరోనాను జయించారు. మొత్తం 16,09,879 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read More »ఆంధ్రప్రదేశ్ కు మేఘా ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకులు
• సింగపూర్ నుంచి మూడు ట్యాంకుల దిగుమతి • రక్షణశాఖ ప్రత్యేక విమానంలో పానాగఢ్ వైమానిక స్థావరానికి చేరుకున్నక్రయోజెనిక్ ట్యాంకులు • ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ లభ్యత • ప్రభుత్వానికి ఉచితంగా అందించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ • ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం • దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ లో ఆక్సిజన్ నింపుకుని రాష్ట్రానికి రానున్న ఆక్సిజన్ ట్యాంకులు …
Read More »