అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అసలు మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వటాన్ని ఆ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈక్రమంలో మహిళలకు వచ్చే రుతుక్రమాన్ని ‘డర్టీ థింగ్’ అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. నెలసరి సెలవులు కల్పించాలంటూ కాంగ్రెస్ సభ్యుడు అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. దీనిపై చర్చిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిపై రాష్ట్రంలోని మహిళాసంఘాలు మండిపడుతున్నాయి.
Read More »పార్టీ మార్పుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లారిటీ
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ . సంచలన వ్యాఖ్యలకు నిలయం ఆయన. తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ అయిన భువనగిరి ఎంపీ,మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారు. అందులో భాగంగానే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానమంత్రి నరేందర్ మోదీని కలిశారు అని కూడా వార్తలు ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటుగా అటు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి. …
Read More »బీజేపీ నేతలూ.. గేమ్ ముగిసిపోలేదు: మమత
కోల్కతా: ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల గెలిచినంత మాత్రాన గేమ్ ముగిసిపోలేదని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ అన్నారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయని.. ఈ విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. కోల్కతాలో మీడియాతో మమత మాట్లాడారు. ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు బీజేపీకి అంత సులువు కావని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల్లో సగం మంది కూడా ఆ పార్టీకి లేరని.. అందుకే గేమ్ ఇంకా …
Read More »BJPలో చేరేందుకు ప్రధాని మోదీతో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి ,ప్రస్తుత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి,మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీలో చేరబోతున్నారా..?. గతంలో తిరుమల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీలో చేరతానని ప్రకటించిన వార్త ఇప్పుడు నిజం కాబోతుందా..?. అంటే అవుననే అంటున్నారు తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు …
Read More »హిజాబ్ పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
హిజాబ్ వివాదం ఎంతటి సంచలనం సృష్టించిందో యావత్ అఖండ భారతావనికి తెల్సిందే. ఈ వివాదంతోనే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారాన్ని దక్కించుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా హిజాబ్ పై కర్ణాటక రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు అని స్పష్టం చేసింది. హిజాబ్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కోట్టేసింది.హిజాబ్ ధరించడం …
Read More »తెలంగాణలో ‘కారు’స్పీడ్లో ఉంది.. యూపీ ఫలితాలు ఇక్కడ రావు: అసదుద్దీన్
హైదరాబాద్: బీజేపీ హైకమాండ్ తెలంగాణపై దృష్టి సారించినా వచ్చే ఎన్నికల్లో పెద్దగా ఉపయోగం ఉండదని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. యూపీ ఎన్నికల ఫలితాలు తనను సర్ప్రైజ్ చేయలేదని చెప్పారు. హైదరాబాద్లో మీడియాతో అసద్ మాట్లాడారు. యూపీలో ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్యాదవ్ మరింత ముందుగానే రెడీ అవ్వాల్సిందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ బలంగా ఉందని.. ‘కారు’ స్పీడ్లో ఉందని …
Read More »ఆప్ అధినేతకు అరవింద్ కేజ్రీవాల్ కి శుభాకాంక్షలు చెప్పని వాళ్లు వీళ్లే.. ఎందుకు..?
సహజంగా ఏ ఎన్నికల్లో ఏదైనా పార్టీ అనూహ్యంగా భారీ విజయం సాధిస్తే ఆ పార్టీ అధినేతకు ఆ పార్టీ తరపున గెలుపొందిన నేతలకు అభినందనలు వెల్లువెత్తుతాయి.ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి విదితమే. ఈ ఎన్నికల ఫలితాల్లో పంజాబ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి,అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్నో కుట్రలు చేసిన బీజేపీకి ఏమాత్రం అవకాశం లేకుండా చేసి భారీ మెజారిటీతో ఆమ్ఆద్మీ పార్టీ …
Read More »సీఎం కేసీఆర్ సూపర్ హీరో
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఆ పార్టీకి చెందిన అర్మూర్ ఎమ్మెల్యే ,పీయూసీ చైర్మన్ అశన్నగారి జీవన్ రెడ్డి ప్రసంశల వర్షం కురిపించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పలు పద్దులపై జరిగిన చర్చల్లో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ” తెలంగాణ రైతాంగానికి జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు,రైతులకు సూపర్ హీరో అని …
Read More »మీకు అంతలేదు.. పగటికలలు మానండి: బీజేపీకి మమత సెటైర్
కోల్కతా: గురువారం వెల్లడైన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నాలుగుచోట్ల బీజేపీ, ఒక చోట ఆప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగు రాష్ట్రాల్లో గెలుపొందడంపై బీజేపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ప్రధాని మోదీ సహా పలువురు నేతలు ఈ ఎన్నికల విజయం 2024 లోక్సభ తీర్పును రిఫ్లెక్ట్ చేస్తోందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ్బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాలుగు …
Read More »ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
గురువారం విడుదలైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ 2024 తీర్పును ప్రజలు 2022లోనే వెలువరించినట్లు చేసిన వ్యాఖ్యలను ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త,ఐపాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ తప్పుపట్టారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు విడుదలైన సమయంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలపై సైకాలజికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి చేసినవేనన్నారు. 2024 లోక్సభ ఎన్నికల పోరు ఆ ఏడాదిలోనే డిసైడ్ అవుతుందని, …
Read More »