దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో 4 ఒమిక్రాన్ కేసులు వచ్చినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. దీంతో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి చేరింది. కాగా ఒమిక్రాన్ వేరియంట్ సాధారణ కరోనా వైరస్ కంటే 70% వేగంగా వ్యాప్తి చెందుతుందని హాంగ్కాంగ్ చేసిన ఓ అధ్యయనం తెలిపింది.
Read More »ఏపీలో కొత్తగా 132 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 29,228 కరోనా టెస్టులు చేయగా 132 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మరణించారు. మొత్తం కేసులు సంఖ్య 20,75,108కు చేరగా ఇప్పటివరకు 14,468 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 186 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,823 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »దేశంలో కొత్తగా 5,784 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా కరోనా కేసులు 5,784 నమోదయ్యాయి. మరోవైపు 252 మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాలు 4,75,888కి చేరాయి. ఇక తాజాగా కొవిడ్ నుంచి 7,995 మంది కోలుకున్నారు. మొత్తంగా 3,41,38,763 మంది రికవరీ అయ్యారు. కాగా ప్రస్తుతం దేశంలో 88,993 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 133.8 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »హీరో అర్జున్ కు కరోనా
కరోనా మహమ్మారి మళ్లీ గుబులు పుట్టిస్తుంది. సామాన్యులే కాక సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్గా బాలీవుడ్ బేబో, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కి కరోనా సోకింది. కరీనాతోపాటు ఆమె స్నేహితురాలు అమృత అరోరాకి కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారు క్వారంటైన్లో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం లోకనాయకుడు కమల్ హాసన్ కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ …
Read More »ఒమైక్రాన్ వేరియంట్ ప్రమాదమా.. కాదా..?
ప్రస్తుతం భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ కొత్తగా వచ్చిన ఒమైక్రాన్ వేరియంట్ కరోనా వైర్సను తలచుకొని వణికిపోతున్నాయి. వేగంగా వ్యాప్తి చెందుతున్న తీరును జాగ్రత్తగా గమనిస్తున్నాయి. కొన్ని దేశాలు గత రెండు వేవ్ల కరోనా వైరస్ సంక్షోభాన్ని గుర్తు చేసుకొని ముందు జాగ్రత్తగా సరిహద్దులు మూసేందుకు కూడా సిద్ధమయ్యాయి. అయితే, ఒమైక్రాన్ వేరియంట్ మరీ అంత ప్రమాదకారి కాదని ఇప్పటిదాకా జరిగిన పరిశీలనల్లో వెల్లడవుతోంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా మినహా ఏ …
Read More »దేశంలో కొత్తగా 7774 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 7774 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,90,510కి చేరింది. ఇందులో 3,41,22,795 మంది కరోనా నుంచి కోలుకోగా, 92,281 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 4,75,434 మంది మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 306 మంది మరణించగా, 8464 మంది కోలుకున్నారని తెలిపింది.దేశంలో యాక్టివ్ కేసులు 560 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని పేర్కొంది. మొత్తం …
Read More »దేశ రాజధానిలో మరో ఒమైక్రాన్ వేరియంట్ కేసు
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మరో ఒమైక్రాన్ వేరియెంట్ కేసు వెలుగుచూసింది.ఢిల్లీలో శనివారం ఒమైక్రాన్ వేరియంట్ రెండో కేసు నమోదైంది. ఢిల్లీలో ఒమైక్రాన్ మొదటి కేసు నమోదైందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు. ఈ వారం జింబాబ్వే నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రయాణికుడి నుంచి తీసుకున్న నమూనాను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించగా ఒమైక్రాన్ వేరియంట్ వెలుగుచూసింది. రోగి ప్రయాణ చరిత్ర ప్రకారం అతను ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లాడు.ఒమైక్రాన్ …
Read More »శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం
కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. మాస్కు ధరిస్తేనే మల్లన్న దర్శనం కల్పించాలని ఆలయ ఈవో లవన్న నిర్ణయించారు. ఇటీవల కరోనా కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో.. కర్నూల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని లవన్న తెలిపారు. భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తామని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని మైక్ ద్వారా తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో …
Read More »దేశంలో కొత్తగా 7992 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 7992 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,82,736కు చేరింది. ఇందులో 3,41,14,331 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,75,128 మంది మృతిచెందారు. మరో 93,277 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 559 రోజుల్లో యాక్టివ్ కేసులు ఇంత తక్కువకు చేరుకోవడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో మహమ్మారి వల్ల మరో 398 మంది బాధితులు …
Read More »స్విట్జర్లాండ్లో 11 ఏండ్లలోపు చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్
స్విట్జర్లాండ్లో ఐదు నుంచి 11 ఏండ్లలోపు చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్కు రంగం సిద్ధమయింది. ఫైజర్ బయోఎన్టెక్ తయారుచేసిన కమిర్నాటీ వ్యాక్సిన్ను చిన్నారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి స్విట్జర్లాండ్ మెడిసిన్స్ ఏజెన్సీ స్విస్మెడిక్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ ఏజ్ గ్రూప్వారికి టీకాలు ఇస్తున్న దేశాల జాబితాలో స్విట్జర్లాండ్ కూడా చేరినట్లయింది. ఇప్పటికే పోర్చుగల్, ఇటలీ, గ్రీస్, స్పెయిన్, కెనడా, అమెరికా దేశాలు ఈ ఏజ్ గ్రూప్ చిన్నారుల్లో వ్యాక్సినేషన్కు …
Read More »