దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో బోధన ఆగస్టు తర్వాత ప్రారంభం కావచ్చని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ నిశాంక్ ప్రకటించారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హోంశాఖ అనుమతించిన మీదటే నూతన విద్యా సంవత్సరంలో కార్యకలాపాలు మొదలుపెడతామని ఆయన స్పష్టం చేశారు. కొవిడ్-19 పరిస్థితులను పూర్తిగా అంచనా వేసిన అనంతరం మాత్రమే.. ఈ అంశంపై నిర్ణయం సాధ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాలలో బోధన కూడా ఆగస్టు తర్వాతనే …
Read More »తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ లక్షణాలు ఉన్న కరోనా పాజిటివ్ పేషెంట్లు ఇంట్లోనే చికిత్స తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కరోనా పేషంట్లకు జిల్లాల్లోనే చికిత్స, జిల్లా కేంద్రాల్లో ఐసోలేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. హోంక్వారంటైన్లో ఉండేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. ప్రజల్లో ఉన్న భయం వారిని ఆస్పత్రి నుంచి బయటికి రానివ్వడం లేదన్నారు. ఇంట్లో ప్రత్యేక గది లేనివారు ఆస్పత్రిలోనే ఉండాలని కోరుకుంటున్నారని, …
Read More »హైదరాబాద్ నగరంలో కరోనా కల్లోలం
హైదరాబాద్ నగరంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటంతో సామాన్యులతో పాటు వైద్యులు, పోలీసులు వణికిపోతున్నారు. ఆదివారం నగరంలో మొత్తం 132 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఆరుగురు మృతి చెందారు. అయితే పాజిటివ్ వచ్చిన వారిలో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిమ్స్ తదితర వైద్యశాలలకు చెందిన వైద్యులు కూడా ఉన్నారు. అంతేకాకుండా తొమ్మిది మంది పోలీసులు, 108 ఉద్యోగి, కొరియర్బాయ్, ఆటోడ్రైవర్ ఉన్నట్లు వైద్యాధికారులు ప్రకటించారు. వీరిని చికిత్స …
Read More »కరోనాతో టీవీ 5 జర్నలిస్టు మృతి
కరోనా మహమ్మారితో టీవీ 5 న్యూస్చానల్ జర్నలిస్టు దడిగె మనోజ్కుమార్ (33) మృతిచెందారు. గాంధీ దవాఖానలో చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం చనిపోయారు. యువ జర్నలిస్ట్ మనోజ్కుమార్ మృతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్ మాదన్నపేటకు చెందిన మనోజ్కుమార్ కొన్నేండ్లుగా టీవీ 5 న్యూస్చానల్ క్రైమ్ రిపోర్టర్గా పనిచేస్తున్నారు. ఎనిమిది నెలల కిందటే సైదాబాద్కు చెందిన యువతితో వివాహం కాగా, ప్రస్తుతం …
Read More »కరోనా కేసుల్లో 5వ స్థానంలో భారత్
భారత్ దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడిచిన ఐదు రోజుల్లో తొమ్మిది వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా కేసుల్లో భారత్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచింది.గడిచిన ఇరవై నాలుగంటల్లో ఏకంగా 9,971కేసులు నమోదు అయ్యాయి.దీంతో మొత్తం ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 2,46,628 కేసులు నమోదయ్యాయి. స్పెయిన్ దాటి ఐదో స్థానంలో నిలిచిందని జాన్ హప్ కీన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.ప్రస్తుతం అమెరికా,రష్యా,బ్రెజిల్,యూకే మొదటి స్థానంలో …
Read More »కరోనా కేసుల్లో భారత్ రోజుకో రికార్డు
భారత్ దేశంలో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రోజుకో రికార్డును తన సొంతం చేసుకుంటుంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 9,971కేసులు నమోదు అయ్యాయి.గత ఐదు రోజుల్లో నమోదైన కేసులు ఇలా ఉన్నాయి. జూన్ 7న మొత్తం కేసులు 9,971 జూన్ 6న మొత్తం కేసులు 9,887 జూన్ 5న మొత్తం కేసులు 9,851 జూన్ 3న మొత్తం కేసులు …
Read More »ఏపీ సచివాలయంలో కరోనా కలకలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మరో ఐదుగురికి కరోనా సోకిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఏపీ సచివాలయంలో కరోనా సోకిన వారి సంఖ్య 10కి చేరింది.దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు వీరితో సన్నిహితంగా ఉన్నవారిని హోం క్వారంటైన్లో ఉంచారు. మరోవైపు సచివాలయంలోని వివిధ బ్లాకులను శానిటైజ్ చేయిస్తున్నారు.
Read More »కరోనా ఆసుపత్రిగా నిమ్స్
తెలంగాణలో కరోనా కేసులు రాష్ట్రంలో నమోదవడం మొదలైనప్పటినుండి, అంటే దాదాపుగా మూడునెలలుగా గాంధీ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో మరెక్కడా చికిత్స లేకపోవడం, కేవలం గాంధీ మాత్రమే అందుబాటులో ఉండడం అన్ని వెరసి వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో నిమ్స్ ను కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక్కడ రెండు వందల పడకలను …
Read More »రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం జగన్..అమిత్ షాతో భేటీ ఎందుకంటే..?
కరోనా వైరస్ విజృంభన, లాక్డౌన్ తర్వాత తొలిసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపు ఉదయం 10 గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ బయల్దేరబోతున్నారు. దాదాపు నాలుగు నెలల తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో …
Read More »హోం క్వారంటైన్ గైడ్ లైన్స్ లో సవరణలు
కేరళ ప్రభుత్వం హోం క్వారంటైన్ గైడ్ లైన్స్ లో సవరణలు చేసింది. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో అనుమానిత లక్షణాలున్నవారుంటే..వాళ్లు ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని నిర్ణయించింది. విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి తిరిగొచ్చిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్-19 ఆస్పత్రిలో చేరాల్సిందేనని కేరళ వైద్యారోగ్య శాఖ మంత్రి కేకే శైలజ పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఉన్నతాధికారులు, పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు …
Read More »