దేశంలో కొత్తగా 11,106 కేసులు నమోదవగా, మరో 459 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,89,623కు చేరగా, మరణాలు 4,65,082కు పెరిగాయి. మొత్తం కేసుల్లో 3,38,97,921 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,26,620 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలో నిన్న 6,111 మంది కరోనా బారినపడ్డారు.
Read More »ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన నిర్ణయం
అన్నదాతలు విజయం సాధించారు. ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించింది. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఇవాళ జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాల్లోనూ వెనక్కి తగ్గని మోదీ సర్కార్.. అన్నదాతల ఆగ్రహానికి తలొగ్గింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. నూతన సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. …
Read More »ఈనెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
ఈనెల 29 నుంచి డిసెంబర్ 23 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాలకు సంబంధించి పార్లమెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఈ సమావేశాల్లో కేంద్రాన్ని పలు అంశాలపై ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. లఖింపూర్, నామమాత్రంగా తగ్గించిన ఇంధన ధరలు, డ్రగ్స్ సరఫరా, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాలపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
Read More »ఢిల్లీ పాలకులకు బుద్ధి చెప్పాలి..
ఒక తండ్రి తన పిల్లలందరిని సమాన దృష్టితో చూస్తాడు. కానీ ఇప్పుడు దేశంలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. రాష్ర్టాల విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. తండ్రి పాత్ర పోషించాల్సిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ర్టాల మధ్య వివక్ష చూపుతున్నది. తెలంగాణ రైతు పండించిన వడ్లు కొనడానికి నిరాకరిస్తున్నది. పైగా రాష్ట్రంలోని బీజేపీ నాయకులు వరి వేసుకోవాలంటూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విధానం. తెలంగాణ …
Read More »నేటినుంచి కర్తార్పూర్ కారిడార్ పునఃప్రారంభం
పాకిస్తాన్ లో సిక్కుల పవిత్ర క్షేత్రం కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ నేటి నుంచి ప్రారంభం కానుంది. 2019 తర్వాత సిక్కుల కోసం పాకిస్తాన్ సరిహద్దులను భారత్ తెరవబోతుంది. కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ను ఈనెల 17వ తేదీ నుంచి బుధవారం నుంచి తిరిగి తెరుస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్షా మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నేటినుంచి సిక్కులకు పవిత్ర దర్శనం కల్పించనున్నారు. పాకిస్తాన్లోని కర్తార్పూర్లో ఉన్న గురుద్వారా …
Read More »దేశంలో కొత్తగా 10,197 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 10,197 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,66,598కు చేరాయి. ఇందులో 3,38,73,890 మంది కోలుకోగా, 1,28,555 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 4,64,153 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 527 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో మరో 12,134 మంది కరోనా నుంచి బయటపడగా, కొత్తగా 301 మంది మరణించారని తెలిపింది. ఇక …
Read More »దేశంలో కొత్తగా 8865 కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8865 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 287 రోజుల్లో ఇదే అత్యల్ప సంఖ్య. ఇక వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 197గా ఉంది. గత 24 గంటల్లో సుమారు 11971 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులోడ్ 1,30,793గా ఉంది. 525 రోజుల్లో ఇదే అత్యల్పం. రోజువారీ …
Read More »దేశంలో కొత్త వైరస్ ‘నోరో’
దేశంలో కొత్త వైరస్ ‘నోరో’ చాప కింద నీరులా విస్తరిస్తోంది. US శాస్త్రవేత్తల ప్రకారం.. వాంతులు, డయేరియా, వికారం, కడుపునొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివి దీని లక్షణాలు. ఇక కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం, వైరస్ సోకిన వారి నుంచి నోరో వ్యాపిస్తుంది. కాగా ఇప్పటికే కేరళలోని వయనాడ్ జిల్లాలో ఓ వెటర్నరీ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. ఇది ఒకరి నుంచి …
Read More »BJPకి గట్టి షాక్
పశ్చిమ బెంగాల్లో పలువురు కాషాయ పార్టీ నేతలు రాజీనామా చేసి పాలక టీఎంసీ గూటికి చేరుతున్న క్రమంలో తాజాగా బెంగాలీ నటి, పార్టీ నేత స్రవంతి ఛటర్జీ బీజేపీని వీడారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి 2న ఆమె బీజేపీలో చేరారు. బెంగాల్ అభివృద్ధిపై కాషాయ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి, ప్రణాళికలు లేవని అందుకే తాను కాషాయ పార్టీని వీడుతున్నానని స్రవంతి ఛటర్జీ స్పష్టం చేశారు.మరోవైపు …
Read More »దేశంలో విద్యాభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ బాటలు
దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని జెడ్పీ చైర్ పర్సన్ సరిత అన్నారు. ఆయన జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ మార్గ్లో ఉన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ..విద్య అనేది రహస్యంగా దాచి పెట్టబడిన ధనం వంటిదన్నారు. విద్యయే సకల భోగాలను, కీర్తిని, …
Read More »