ఓ ఫ్రెండ్ వాట్సాప్ స్టేటస్ ఒక అమ్మాయి నిండు ప్రాణాలను బలిగొన్నది. ఈ ఘటన తాండూర్ మండలం అచ్చలాపూర్ లోని కొమ్ముగూడెంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.వివరాల్లోకి వెళ్తే.. కొమ్ముగూడెంకు చెందిన గంధం రాజయ్య కూతురు లత(17) హైదరాబాద్లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉగాది పండుగకు లత ఇంటికొచ్చింది. అయితే అదే గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడు లతతో దిగిన ఫోటోలను బుధవారం వాట్సాప్ …
Read More »కేంద్రంలో మోదీ సర్కారుపై టీఆర్ఎస్ పోరాటం ఉధృతం
కేంద్రంలో మోదీ సర్కారుపై టీఆర్ఎస్ పోరాటాన్ని ఉధృతం చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పల్లె, పట్టణం, ఊరు, వాడను ఏకం చేస్తూ తెలంగాణ ధాన్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తూ జంగ్ సైరన్ మోగించింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పట్టణ, గ్రామాల్లో రైతులు, పార్టీ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం …
Read More »మంత్రి కేటీఆర్తో మేఘాలయ సీఎం సంగ్మా సమావేశం
హైదరాబాద్ పర్యటనలో ఉన్న మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. శుక్రవారం ఉదయం ప్రగతి భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సీఎం సంగ్మా సమావేశమయ్యారు. వివిధ అంశాలపై కేటీఆర్, సంగ్మా చర్చించారు. సంగ్మా దంపతులను కేటీఆర్తో పాటు ఆయన సతీమణి శైలిమ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
Read More »గవర్నర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై చేసిన వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. నేను తలచుకుంటే అసెంబ్లీ రద్దు అయ్యేది అనే విధంగా తన పరిధి దాటి వ్యాఖ్యలు చేశారని, ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తులు అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాటి గవర్నర్ రాంలాల్ కూలదోసిన తర్వాత ఎలాంటి ప్రజాగ్రాహాన్ని చవిచూశారో మనందరికీ తెలిసిందేనన్నారు. గతంలో గవర్నర్ గా ఉన్న నరసింహాన్ …
Read More »పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం : మంత్రి తలసాని
పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాడి పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరంలోని హైటెక్స్లో నిర్వహించిన ఫుడ్ అండ్ డెయిరీ ఎగ్జిబిషన్ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. …
Read More »ఢిల్లీ వేదికగా ధర్నాకు TRS రెడీ
ధాన్యం కొనుగోళ్ల అంశం పై ఢిల్లీలో పోరాటానికి సిద్ధమవుతోంది టీఆర్ఎస్ పార్టీ. వరిపోరును ఉధృతం చేసింది టీఆర్ఎస్ పార్టీ. వరుస ఆందోళనలతో హీట్ పుట్టిస్తున్న గులాబీ పార్టీ నేతలు గురువారం తెలంగాణలోని అన్ని జిల్లాకేంద్రాల్లో దీక్షలు చేపట్టింది. టీఆర్ఎస్ దీక్షలతో జిల్లా కేంద్రాలన్నీ హోరెత్తాయి. దీక్షలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రైతుబంధు సమితి ఛైర్మన్లు సహా ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. సిరిసిల్లలోని అంబేడ్కర్ కూడలిలో …
Read More »ఒకే దేశం ఒకే కొనుగోలు విధానం అమలు చేయాలి.
తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నాడు మధిర టౌన్ లో ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులతో కలసి జడ్పీ చైర్మన్, TRS మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు నల్లజెండాలతో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. …
Read More »యుద్ధం ఆపేందుకు రష్యా మరో ప్రతిపాదన
ఉక్రెయిన్ దేశంపై రష్యా చేస్తున్న యుద్ధం ఆపేందుకు మరో ప్రతిపాదన చేసింది. చర్చల సందర్భంగా సూచించిన షరతులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరిస్తే మిలిటరీ ఆపరేషన్ నిలిపివేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా నాటోలో చేరాలనే అన్ని ప్రణాళికలను ఉక్రెయిన్ విరమించుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఇటీవల పుతిన్, జెలెన్ స్కీ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.. అయితే ఉక్రెయిన్లోని బుచాలో రష్యా …
Read More »చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం
కరోనా వైరస్ తొలిసారి వెలుగుచూసిన చైనాలో మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 20,472 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా అతిపెద్ద నగరం షాంఘైలో 17,077 కేసులు బయటపడ్డాయి. తాజా ఉద్ధృతిలో ఈ ఒక్క నగరంలోనే 90 వేలకు చేరింది. చైనాలో ఇటీవల ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్ ఉద్ధృతితో మహమ్మారి విజృంభిస్తోంది
Read More »అర్బన్ ఫారెస్టులకు అంతర్జాతీయ గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా తెలంగాణ అమలు చేస్తున్న పచ్చదనం పెంపు, అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రాష్ట్రంలో 109 అర్బన్ ఫారెస్టులను, హెచ్ఎండీఏ పరిధిలో 59 పార్కులను హరితహారంలో అభివృద్ధి చేశారు. తెలంగాణలో అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతిని అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ఫారెస్ట్ సైన్స్ గుర్తించింది. అర్బన్ ఫారెస్టులపై రాసిన వ్యాసం ఆ సంస్థ ఆన్ లైన్ …
Read More »