తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..సూపర్ స్టార్ మహేశ్ బాబు, హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో క్రేజీ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ముహూర్తానికి క్లాప్ కొట్టారు మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్. అయితే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ ఓ శోభన నటించనున్నట్లు తెలుస్తోంది. ఆమెది మహేశ్ పిన్ని పాత్ర అని …
Read More »పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం
దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన మామ (భార్య అశ్విని తండ్రి) రేవనాథ్(78) గుండెపోటుతో మరణించారు. పునీత్ మరణానంతరం రేవనాథ్ తీవ్ర ఒత్తిడికి లోనై అనారోగ్యం బారినపడ్డారు. ఈక్రమంలోనే గుండెపోటుకు గురికాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా కన్నుమూశారు. పునీత్ కూడా గుండెపోటుతోనే మృతి చెందిన విషయం తెలిసిందే. భర్త, తండ్రిని కోల్పోయిన అశ్విని తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
Read More »మీకు తరుచూ తల తిరుగుతోందా?
మీకు తరుచూ తల తిరుగుతోందా?.. అయితే వీటిని చేయండి.. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ ఉసిరి పొడిని మిక్స్ చేసి, ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్న వడగట్టుకుని తేనె కలుపుకుని తాగాలి. డా అధికంగా పండ్ల రసాలను తాగాలి. తులసి ఆకులను తినాలి. స్ట్రాబెర్రీలను పెరుగులో మెత్తగా కలుపుకుని తినాలి. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పుచ్చకాయ విత్తనాలు, చిటికెడు గసగసాలు, 5 బాదం, పిడికెడు …
Read More »త్వరలో ప్రకాశ్ పదుకొణె బయోపిక్
త్వరలోనే తన తండ్రి, మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాశ్ పదుకొణె బయోపిక్ తీస్తున్నట్లు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రకటించింది. ‘భారత్లో క్రీడల గురించి మాట్లాడుకునేలా చేసిన వ్యక్తుల్లో మా నాన్న ఒకరు. 1981లోనే ఆయన బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. ఇప్పుడున్నంత అధునాతన సౌకర్యాలు లేకపోయినప్పటికీ తను ఒక్కో మెట్టూ ఎదిగారు.’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
Read More »బోయపాటి శీను కాంబినేషన్లో హీరో రామ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో..ఎనర్జిటిక్ హీరో రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శీను కాంబినేషన్లో సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. తాను బోయపాటితో సినిమా చేయనున్నట్లు రామ్ ట్వీట్ చేశాడు. ఇది తన 20వ సినిమా అని.. ఎమోషన్స్ పండించడంలో దిట్ట అయిన బోయపాటితో సినిమా చేయడం ఆనందంగా ఉందని తెలిపాడు.
Read More »రానున్న ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు
రానున్న ఐదేళ్లలో భారత్లో ఐటీ కంపెనీలు 50 లక్షల మంది ఉద్యోగులను నియమించుకుంటాయని.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝనన్వాలా ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో హైరింగ్ ప్రక్రియ 31 శాతం పెరగనుందన్న ట్యాగ్ సర్వే” ఆధారంగా 50 లక్షల ఐటీ కొలువులు వస్తాయని రాకేష్ అంచనా వేశారు. కొవిడ్ తర్వాత కొత్త ప్రాజెక్టుల్లో ఉద్యోగుల అవసరం పెరగడంతో కంపెనీలు హైరింగ్ ప్రక్రియను వేగవంతం చేశాయి.
Read More »ఆకాశాన్నంటిన బంగారం ధరలు
భారతీయుల్లో బంగారం అంటే ఎంతో ప్రీతి. పుత్తడి కొనుక్కోవాలని.. ఆభరణాలు చేయించుకోవాలని మహిళలు ఆరాటం చూపుతారు. అలాగని బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు.. పెట్టుబడికి మార్గం కూడా.. ధర తగ్గినప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టడం శుభ తరుణం అని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. గతేడాది రూ.43 వేల వద్ద ఉన్న తులం బంగారం ఇప్పుడు రూ.50వేలకు చేరుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు వీడిపోయినా పుత్తడి …
Read More »హెచ్ఎండిఏ పరిధిలో చెరువుల అభివృద్ధి, సంరక్షణ కోసం మరిన్ని చర్యలు
హెచ్ఎండీఏ కార్యకలాపాలు, చేపట్టిన ప్రాజెక్టుల పైన మంత్రి కే తారకరామారావు ఈ రోజు నానక్ రామ్ గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో సుదీర్ఘమైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎండిఏ పరిధిలో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు మరియు భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన అంశాలపైన అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల సంరక్షణపైన ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా చెరువుల …
Read More »ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు : మంత్రి తలసాని.
ప్రైవేటుకు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, బలోపేతం చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన ‘మన బస్తి – మన బడి’ కార్యక్రమంపై మంత్రి మసబ్ ట్యాంక్లోని కార్యాలయంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన …
Read More »బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఆశలపై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి నీళ్లు
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఆశలపై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ కిషన్రెడ్డి నీళ్లు చల్లారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రిగా.. కేంద్రం నుంచి విభజన హామీలను సాధించుకొని రావాల్సిన బాధ్యతను విస్మరించి, అది సాధ్యం కాదంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బయ్యారంలో స్టీల్ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్న విషయాన్ని తమ ప్రభుత్వం ఇప్పటికే చెప్పిందని పేర్కొన్నారు. …
Read More »