Home / Tag Archives: slider (page 476)

Tag Archives: slider

అరిసెలు వల్ల లాభాలెన్నో…?

సంక్రాంతి పండుగ సమయంలో ప్రతి తెలుగింట్లో 3 తప్పనిసరిగా ఉండే పిండివంటకం అరిసెలు. వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొత్త బియ్యపు పిండి, నూనె, బెల్లం, నువ్వులతో అరిసెలు తయారు చేస్తారు. బెల్లం రక్తాన్నిశుద్ధి చేయడంతోపాటు శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది. కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఐరన్తో పాటు పలు పోషకాలు శరీరానికి లభిస్తాయి. బియ్యం పిండి శరీరాన్ని వేడిగా ఉంచుతుంది.

Read More »

యూపీ అసెంబ్లీ ఎన్నికలకి తొలి విడత నోటిఫికేషన్ విడుదల

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాల్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యాయి.. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 10న ఎన్నికలు జరగనున్నాయి. కాగా తొలి విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ళ్ పార్టీలు విడుదల చేయగా.. బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.

Read More »

సంక్రాంతి కి ఆర్జీవీ తనదైన స్టైల్లో విషెష్

అసలు పండగలకు శుభాకాంక్షలు చెప్పడమే ఇష్టపడని వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడు. ‘మీకు అంబానీని మించిన ఇల్లు, డబ్బు రావాలి. అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు, అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు దొరకాలి. భర్తలను భార్యలు వేధించకూడదు. చిన్న సినిమాలు బాహుబలి కంటే పెద్ద హిట్ కావాలి. ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచాలి. నన్ను ద్వేషించే వారి కోసం నేను త్వరగా చనిపోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు’ …

Read More »

సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా

సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో 1-2తేడాతో భారత్ కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత్పై సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సౌతాఫ్రికాలో సిరీస్ గెలవాలన్న కల నెరవేరకుండానే పోయింది. సౌతాఫ్రికా టీమ్ పీటర్సన్-82, డుసెన్-41, ఎల్గర్-30 రాణించారు. * టీమిండియా స్కోర్లు 223 & 198 * సౌతాఫ్రికా స్కోర్లు 210 & 212/3

Read More »

చలికాలం సీజన్ లో జుట్టు రాలుతుందా…?

చలికాలం సీజన్ లో ఇంటి చిట్కాలు ఉన్నాయి. జుట్టు రాలడం తగ్గించడంలో బియ్యం నానబెట్టిన నీరు బాగా పనికొస్తుంది. బియ్యాన్ని శుభ్రంగా కడిగి.. నీళ్లు పోసి 2 రోజుల పాటు నానబెట్టాలి. ఈ నీళ్లను ఫ్రిజ్లో పెట్టుకుని జట్టుకు పట్టించి క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నానబెట్టిన మెంతుల పేస్టులో నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించినా రిజల్ట్ కనిపిస్తుంది.

Read More »

నా హత్యకు కుట్ర జరుగుతుంది..

ఏపీ అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తన హత్యకు కుట్ర జరుగుతోందని  సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకోసం జార్ఖండికి చెందిన ఓ ముఠాతో చర్చలు జరిగాయని అన్నారు. దీనిపై ప్రధానికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. ఏపీ సీఎం,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏ వ్యక్తి అయిన నచ్చకపోతే ఆ వ్యక్తిని తీసేస్తారు.  మెగాస్టార్ చిరంజీవిని అల్లరి …

Read More »

TDP నేత పరిటాల శ్రీరామ్ కి కరోనా

ఏపీలో అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల తల్లి సునీతతో కలసి ధర్మవరం నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను కలసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలుంటే టెస్టులు చేసుకోవాలని శ్రీరామ్ సూచించారు.

Read More »

నిజామియా టీబీ ఆసుపత్రిలో కరోనా కలవరం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోనిచార్మినార్లోని నిజామియా టీబీ ఆసుపత్రిలో శుక్రవారం62 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు… వీరిలో39 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.

Read More »

సర్జరీ చేయించుకునే వారు కరోనా టెస్ట్ చేయించుకోవాలా..?వద్దా..?

లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్షలు చేయాలని.. సర్జరీలు చేయించుకునే వారికి కరోనా పరీక్ష తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సర్జరీ చేయించుకునే వారిలో లక్షణాలు ఉన్నప్పుడే నిర్ధారణ పరీక్షకు వెళ్లాలని సూచించింది. కరోనా నిర్ధారణ అయ్యాక తీసుకోవాల్సిన చికిత్సపై వైద్యుల సలహాను తప్పనిసరిగా పాటించాలంది. N95 మాస్కును రోజంతా.. క్లాత్ మాస్కును 8 గంటలకోసారి మార్చి కొత్తది ధరించాలని కేంద్రం పేర్కొంది.

Read More »

ఏపీలో కొత్తగా 4,528 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38,816 టెస్టులు చేయగా.. కొత్తగా 4,528 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కోవిడ్తో మరణించారు. మరోవైపు 418 మంది పూర్తిగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,313 కేసులు ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat