తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవి రాజీనామాకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. ఈ నెల 14న ఈటల బీజేపీలో చేరతారని ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. శనివారం నాడు మొదట.. నగరంలోని గన్పార్క్ దగ్గర రేపు అమరవీరుల స్థూపానికి ఈటల నివాళులు అర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి …
Read More »విభిన్న పాత్రలో రాశిఖన్నా
వినూత్న కథాంశాల్ని ఎంచుకొని పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి కథానాయికలకు వెబ్ సినిమాలు మంచి వేదికలుగా నిలుస్తున్నాయి. సమంత, తమన్నా వంటి అగ్ర నాయికలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద సత్తాచాటడంతో మరికొంత మంది తారలు వారి మార్గాన్ని అనుసరిస్తున్నారు. తాజాగా పంజాబీ సుందరి రాశీఖన్నా డిజిటల్ వేదికపై కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అజయ్దేవ్గణ్తో కలిసి ఆమె ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. రాజేష్ దర్శకుడు. …
Read More »పెళ్లిపై తాప్సీ క్లారిటీ
అప్పుడెప్పుడో విడుదలైన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాప్సీ ఇక్కడ పెద్దగా రాణించలేకపోయింది. దీంతో కోలీవుడ్లోను తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా నిరాశే ఎదురు కావడంతో బాలీవుడ్ చెక్కేసింది. ఇప్పుడు అక్కడ బిజీ హీరోయిన్స్లో ఒకరిగా మారింది. ఎక్కువగా మహిళా ప్రాధాన్యత చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది తాప్సీ. అయితే ఈ అమ్మడు డెన్మార్క్కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథ్యూస్తో పీకల్లోతు ప్రేమలో ఉంది. …
Read More »దేశంలో కొత్తగా 91,702 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా ఉధృతి తగ్గుతున్నది. వరుసగా నాలుగో రోజు లక్షకు దిగువన పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91,702 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 1,34,580 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మరో 3,403 మంది వైరస్ బారినపడి ప్రాణాలు వదిలారని తెలిపారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,74,823కు పెరిగింది. …
Read More »కరోనా వ్యాధి లో సిటి స్కాన్ (CT Scan) గురించి కచ్చితంగా తెలుసుకోవలసినవి..
*కరోనా వ్యాధి లో CT స్కాన్ (సిటీ స్కాన్) గురించి కచ్చితంగా తెలుసుకోవలసినవి* ? ఇవాళ చాలామందికి కరోనా ఉన్నదా ? లేదా ? అని తెలుసుకోవడానికి మరియు కరోనా జబ్బు వచ్చిన తర్వాత ఎలా ఉంది , ఎంత తీవ్రత వుంది అని తెలుసుకోవడానికి సిటీ స్కాన్ చేస్తున్నారు. ఈ సిటీ స్కాన్ లో రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి *CORADS* రెండు *CT severity …
Read More »తెలంగాణలో కొత్తగా 1,798 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,798 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 14 మంది మృతి చెందారు. 2,524 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23,561 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ 1,30,430 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
Read More »విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు
ఈనెల 30వ తేదీ వరకు విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు వారాంతపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. * రైలు నంబరు 02449-02450 షాలిమార్-సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైలు 9, 16, 23, 30 తేదీల్లో షాలిమార్లో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.55కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 11, 18, 25, జులై 2వ తేదీల్లో ఇదే రైలు …
Read More »దేశంలో కొత్తగా 94వేల కరోనా కేసులు..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. రాష్ట్రాలు విధించిన ఆంక్షల ఫలితంగా వరుసగా మూడోరోజు లక్షకు దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 94వేల మందికి కరోనా సోకింది. అయితే బిహార్ ప్రభుత్వం మరణాల లెక్కను సవరించడంతో మృతుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించింది. రికవరీ రేటులో పెరుగుదల, క్రియాశీల కేసులు తగ్గుతుండటం ఊరటనిచ్చే విషయాలు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది._ …
Read More »ప్రజల ఆశయాలే పార్టీ సిద్ధాంతాలు: YS షర్మిల
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం జులై 8న కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడించారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో నూతన పార్టీ ఆవిర్భావ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన షర్మిల రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలు రూపొందించనున్నట్లు ఆమె తెలిపారు. పార్టీ ఎజెండాను ప్రజలే రాయాలని.. ప్రతిబిడ్డ ఒప్పుకొనేలా ఉండాలన్నారు. ప్రజలు తమ …
Read More »ఏ క్షణం నుంచైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం
ఏపీకి విశాఖ, అమరావతి, కర్నూలు రాజధానుల అంశంలో మరో ఆలోచనకు తావులేదని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొన్ని దుష్టశక్తులు కోర్టులకు వెళ్లి ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనిపై న్యాయ ప్రక్రియ కొనసాగుతోందని, ఏ క్షణమైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం కావొచ్చని తమ ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లు తెచ్చినప్పుడు విశాఖ రాజధాని ప్రక్రియ …
Read More »