మహారాష్ట్రలో క్రమంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతుండటంతో లాక్డౌన్ సడలింపుల దిశగా ఆ రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తోంది. లాక్డౌన్ను దశలవారీగా సడలిస్తామని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. జూన్ 30 నాటికి అన్లాక్ ప్రక్రియ పూర్తవుతుందని, అయితే ఎప్పటి నుంచి అన్లాక్ ప్రారంభించాలనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. మొత్తం నాలుగు దశల్లో అన్లాక్ అమలు చేయనున్నట్లు చెప్పారు.
Read More »హాయిగా నిద్రపోవాలంటే
హాయిగా నిద్రపోవాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.. నిద్రకు ముందు గోరువెచ్చని పాలు తాగండి రాత్రిపూట టీ, కాఫీ, ఆల్కహాల్ తీసుకోకండి రాత్రి భోజనం మితంగా తినండి త్వరగా జీర్ణంకాని పదార్థాలు తీసుకోకండి రోజూ రాత్రి ఒకే సమయానికి నిద్రపోండి బెడ్రూంలో తక్కువ కాంతి ఉండేలా చూసుకోండి నిద్రకు ముందు ఫోన్ అస్సలు వాడకండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి రోజూ యోగా, ధ్యానం, వ్యాయామం చేయండి
Read More »రష్మిక పిలుపు
ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా ధైర్యంగా ఉండాలని హీరోయిన్ రష్మిక ఓ వీడియో ట్వీట్ చేసింది. ‘ రోజు రోజుకు విజృంభిస్తోన్న కరోనా సవాల్ విసురుతోంది. ఈ సమయంలో మనం సానుకూలంగా ఆలోచించాలి. ఈ యుద్ధంలో మనమే గెలుస్తాం. ప్రజల్లో ధైర్యం నింపడానికి వచ్చే వారం నుంచి మన పరిసరాల్లోని కొవిడ్ హీరోలను పరిచయం చేయాలి అనుకుంటున్నాను. మీ ముఖాల్లో చిరునవ్వు కోసం ఈ చిన్ని ప్రయత్నం’ అని …
Read More »రేపటి నుండి FB,Twitter,Instagram,Whatsapp పని చేయవా..?
ఇండియాలో రేపట్నుంచి FB, ట్విట్టర్, ఇన్స్టాలు బ్లాక్ కాబోతున్నాయని కొన్ని ప్రభుత్వ వర్గాల సమాచారం. డిజిటల్ కంటెట్స్పై కోడ్ ఆఫ్ ఎథిక్స్, ఫిర్యాదుల పరిష్కారానికి ఫ్రేమ్వర్క్ రూల్స్తో పాటు కొత్త నిబంధనలు రేపట్నుంచి అమల్లోకి రానున్నాయి. FEBలోనే వీటితోపాటు న్యూస్ సైట్స్, OTTల కోసం కేంద్రం రూల్స్ విడుదల చేసి.. మే 25 వరకు అమలు చేసుకునేలా గడువిచ్చింది. ఇప్పటివరకు ‘కూ ‘సైట్ మాత్రమే వీటిని పాటించింది.
Read More »లాక్డౌన్, వ్యాక్సినేషన్పై సీఎం కేసీఆర్ కీలక సమావేశం
తెలంగాణ రాష్ర్టంలో కరోనా లాక్డౌన్, వ్యాక్సినేషన్తో పాటు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలతో పాటు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కరోనా వ్యాక్సినేషన్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటగా ఫ్రంట్ లైన్ వారియర్లకు …
Read More »సాయం చేయండి-శృతి హసన్ పిలుపు
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ, ఇలాంటి వారిని తమకు తోచిన విధంగా ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని హీరోయిన్ శృతిహాసన్ పిలుపునిచ్చింది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ‘లాభం’ చిత్రంలో నటించింది. అలాగే, తెలుగు, కన్నడ భాషల్లో కూడా మరికొన్ని ప్రాజెక్టుల్లో నటిస్తోంది. అయితే, లాక్డౌన్ కారణంగా సినిమాల షూటింగులన్నీ ఆగిపోవడంతో ప్రస్తుతం ముంబైలోని తన సొంతింటిలో ప్రియుడితో …
Read More »హీరోగా బాలనటుడు
బాహుబలి, రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథం’ తదితర చిత్రాల్లో బాలనటుడిగా కనిపించిన సాత్విక్ వర్మ హీరోగా మారాడు. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో సాగే ‘బ్యాచ్’లో అతను హీరోగా నటించాడు. దర్శకుడు శివ మాట్లాడుతూ ‘‘ఇదొక యూత్ఫుల్ కాలేజీ ఎంటర్టైనర్. పోకిరీ కుర్రాళ్లు క్రికెట్ బెట్టింగ్లో ఏం చేశారన్నది కథ’’ అని చెప్పారు. ‘‘చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందీ సినిమా. త్వరలో విడుదల చేస్తాం’’ అని నిర్మాత రమేశ్ ఘనమజ్జి …
Read More »కంటతడిపెట్టిన సోను సూద్
కరోనా బాధితుల పాలిట ఆపద్బాంధవుడు సోనూ సూద్ ఓ ఇంటర్వ్యూలో కంటతడిపెట్టాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు బ్రతికుండి బెడ్లు, ఆక్సిజన్ కోసం పోరాడుతుంటే తాను తట్టుకోలేకపోయేవాడినని భావోద్వేగానికి గురయ్యాడు. కాగా సోనూ తండ్రి శక్తి సాగర్ సూద్ పంజాబ్లో వ్యాపారం చేసేవారు. ఆకలితో ఉన్నవారికి సోనూతో కలిసి సాయం చేసేవారు. ఇక సోనూ తల్లి సరోజ్ పేదలకు ఉచితంగా చదువు చెప్పేవారు. అనారోగ్యంతో కొంతకాలం క్రితం వారు కన్నుమూశారు.
Read More »మాజీ మంత్రి ఈటల భూబాగోతంపై మరో దర్యాప్తు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం లో ముఖ్యమంత్రి KCR కు మరో ఫిర్యాదు అందింది. ఈటెల రాజేందర్ కుమారుడు ఈటెల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారనీ,తనకు న్యాయం చేయాలని కోరుతూ, మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ సీఎం కెసిఆర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన …
Read More »ఓ దృఢ సంకల్పం ఘన విజయం సాధించి నేటికి రెండేళ్లు
రాజకీయ కుట్రలకు ఎదురు నిలిచిన ఆ గుండె ఘన విజయం సాధించి రెండేళ్లు. ఆ గుండె చప్పుడుకు ప్రత్యర్ధి కోటలు బద్దలై ఇప్పటికీ కోలుకోలేదు. ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు పాలనా పగ్గాలు చేపడితే ప్రభుత్వ పథకాలు ఎలా ఉంటాయో ఈ రెండేళ్లలో చూశాం. పారదర్శకతతో కూడిన పాలన ఎలా ఉంటుందో చూస్తున్నాం. ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో కూర్చుంటే రాలేదు. …
Read More »