సెకండ్ వేవ్లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో ఎన్నడూ లేనంతగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా వైరస్ ఎవ్వరిని వదలడం లేదు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులను సైతం కరోనా వదలడం లేదు. ఈ మధ్యే క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా భారత జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కుటుంబంలో కరోనా కలకలం …
Read More »తెలంగాణలోని టీచర్లకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు
తెలంగాణలోని టీచర్లకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించాలని విద్యాశాఖ యోచిస్తోంది. మే 26 చివరి వర్కింగ్ డే అని ఇది వరకు ప్రభుత్వం ప్రకటించింది. అయితే పది పరీక్షలను రద్దు చేసినా, టీచర్లు మాత్రం రోజూ డ్యూటీకి హాజరవుతున్నారు. కరోనా నేపథ్యంలో సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో ఏప్రిల్ 23ను చివరి పని దినంగా నిర్ణయించి, 24 నుంచి సెలవులు …
Read More »రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్ కు ఆర్చర్, బెన్ స్టోక్స్ ఇప్పటికే దూరం కాగా తాజాగా ఇంగ్లండ్ క్రికెటర్ లియామ్ లివింగ్ స్టోన్ సైతం ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. గతేడాదిగా బయో బబుల్లో ఉంటున్నానని చెప్పిన అతను నిన్న రాత్రి స్వదేశానికి పయనమయ్యాడు. బిగ్బాష్ లీగ్ అదరగొట్టిన ఈ బ్యాట్స్ మెన్స్ కు ఐపీఎల్ లో ఆర్ఆర్ తరపున ఆడే అవకాశం దక్కలేదు. 3 …
Read More »తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త
తెలంగాణలో కొత్త జోన్ల విధానం ఖరారు అయిన సంగతి విదితమే..దీంతో ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్-1, 2, 3 సహా ఇతర పోస్టుల భర్తీకి లైన్ క్లియరైంది. ఇక ప్రభుత్వ శాఖలు రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఖరారు చేయగానే నోటిఫికేషన్లు రానున్నాయి. గ్రూప్-1 వంటి పోస్టులు జోన్ల కారణంగానే భర్తీకి నోచుకోలేదు. ఇప్పుడిక 4వేలకుపైగా పోస్టులు పడే ఛాన్సుంది. ప్రభుత్వం చెప్పిన 50వేల ఉద్యోగాలకూ కొత్త జోనల్ …
Read More »చెన్నై కెప్టెన్ ధోనీ వారసుడు అతడే..?
చెన్నై కెప్టెన్ ధోనీ వారసుడు జడేజానే అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ధోనీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పాడు. జడ్డూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో పాటు ఆలోచనా విధానం బాగుంటుందన్నాడు. ధోనీ 2,3 ఏళ్లకు రిటైర్ అవ్వొచ్చని, ఆ తర్వాత చెన్నైను నడిపించేందుకు తాను జడేజానే ఎంపిక చేస్తానన్నారు. ఆటపై జడ్డూకు మంచి నాలెడ్జ్ ఉంటుందని చెప్పాడు.
Read More »తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు జిల్లాల్లో భారీగా కేసులు రికార్డవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,542 పాజిటివ్ కేసులు నమోదవగా.. 20 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారని వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్లో తెలిపింది. తాజాగా 2,887 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 46,488 యాక్టివ్ …
Read More »దేశంలో కరోనా మరణ మృదంగం
దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసులతో పాటు రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొవిడ్ రోజువారీ కేసులు దేశంలో కొత్తగా దాదాపు మూడు లక్షలకు చేరువవగా.. 2,023 మంది మరణించారు. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి ఇంత మొత్తంలో కరోనా కేసులు, మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. 24 గంటల్లో 2,95,041 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ …
Read More »మీకు ఈ అలవాట్లు ఉన్నాయా..?. అయితే ఇప్పుడే మానుకొండి..!
మీకు ఈ అలవాట్లు ఉన్నాయా… అయితే ఇప్పుడే మానుకొండి.. 1. తక్కువ నిద్ర: రోజూ కనీసం 7 గంటలు నిద్రపోవాలి. నిద్ర తక్కువైతే జీవితకాలం తగ్గుతుంది. 2. ధూమపానం వద్దు: పొగ తాగితే వయసు పదేళ్లు క్షీణిస్తుంది 4. హెడ్ ఫోన్స్ తో పెద్ద శబ్దంతో వినొద్దు: వినికిడి సామర్థ్యం తగ్గుతుంది. యాక్సిడెంట్లు జరుగుతాయి. 5. తీపి పదార్థాలు ఎక్కువగా తినవద్దు 6. ఫాస్ట్ఫుడు దూరంగా ఉండండి 7. ఎక్కువ …
Read More »రాత్రిపూట కర్ఫ్యూతో ఏమి లాభం – విక్రమార్క భట్టీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూతో ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. జన సంచారం తక్కువగా ఉండే రాత్రి సమయంలో కర్ఫ్యూ పెట్టి ఏం లాభమని పశ్నించారు. ఈ నిర్ణయం కరోనా వ్యాప్తిని ఎలా అడ్డుకోగలదో అర్థం కావట్లేదన్నారు. కరోనా కట్టడికి పగటి పూట కర్ఫ్యూ విధించాలని సూచించారు. కనీసం 144. సెక్షన్ విధించి నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. …
Read More »ఢిల్లీ సర్కారు మరో సంచలన నిర్ణయం
లాక్డౌన్ విధింపుతో ఉపాధికి దూరమైన నిర్మాణ రంగ కూలీలను ఆదుకునేందుకు ఢిల్లీ సర్కారు ముందుకొచ్చింది. రిజిస్టర్ అయిన కూలీలకు రూ. 5,000 చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో ఇప్పటివరకు 1,71,861 మంది నిర్మాణ కూలీలు రిజిస్టర్ అయ్యారు. వీరికి రూ. 5,000 సాయం అందనుంది. ఇక రాష్ట్రంలోని వలస కూలీలకు వసతి, వైద్యం, భోజనం లాంటి సౌకర్యాలను పర్యవేక్షించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసింది.
Read More »