పుదీనా ఆకులతో ఆరోగ్యం ఉంటుంది తెలుసా.. అసలు పుదీనా ఆకులతో ఉపయోగాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పుదీనా ఆకుల వాసనను పీల్చడం ద్వారా శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి పుదీనా వాసన మెదడును ఉత్తేజితం చేస్తుంది మైగ్రేన్ సమస్య దూరమవుతుంది అలర్జీ, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది శీతాకాలంలో పుదీనా ఆకులు వేసి ఆవిరి పడితే జలుబు, గొంతు నొప్పుల నుంచి నివారణ లభిస్తుంది పుదీనాలో ఉండే విటమిన్ C, D, E, కాల్షియం , …
Read More »డిఫరెంట్ గా “ప్రేమమ్” ఫేమ్ మడోన్నా సెబాస్టియన్
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ ఓ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమెది భిన్నమైన క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. నానికి మడోన్నాకు కలకత్తా నేపథ్యంలో వచ్చే సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయట. ఇంకా ఈ మూవీలో నానికి జోడిగా సాయి పల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారు
Read More »SDG సాధనలో తెలంగాణ భేష్
సమీకృత అభివృద్ధి లక్ష్యాల(SDG) సాధనలో తెలంగాణ రాష్ట్ర పనితీరు బాగుందని 15వ ఆర్థిక సంఘం ప్రశంసించింది. 2019లో ఎస్ డీజీ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం 5వ స్థానంలో నిలిచిందని వెల్లడించింది. 2015-19 మధ్యకాలంలో మెరుగైన వృద్ధి రేటుతో ముందుకు సాగిందని వివరించింది. అటు వెనుకబడిన 20 శాతం మండలాల అభివృద్ధికి కార్యచరణ రూపొందించాలని సూచించింది. దేశంలో వామపక్ష తీవ్రవాదం అభివృద్ధిపై ప్రభావం చూపుతున్న 35 జిల్లాల్లో.. ఒకటి తెలంగాణ రాష్ట్రంలో …
Read More »చిలకడ దుంపలు తింటే ఉంటది..?
టేస్టీగా ఉండే చిలకడ దుంపలు ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్-ఎ వల్ల రోగనిరోధక శక్తి బలోపీతమవుతుంది. ఇంకా కంటి చూపును మెరుగుపరుస్తుంది. వీటిని ఉడకబెట్టుకుని తింటే పోషకాలు అంది చర్మం నిగనిగలాడుతుంది సంతానోత్పత్తి సమస్యలకు చిలకడ దుంపలు చెక్ పెడతాయి. గొంతు, ఛాతీ భాగాల్లో ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. మొటిమలను నిలువరిస్తాయి. శరీర ఎదుగుదలను ప్రేరేపిస్తాయి
Read More »హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ నగర వాసులకు త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు కనువిందు చేయనున్నాయి. మరో రెండు నెలల్లో సిటీ రోడ్లపై దూసుకుపోనున్నాయి. ప్రయోగాత్మకంగా డబుల్ డెక్కర్ బస్సులను తిప్పాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు బస్సుల కోసం టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈనెల 18న ప్రీ బిడ్ నిర్వహించి, బస్సులు ఎలా ఉండాలన్న విషయాన్ని ఆ సమావేశంలో తయారీదారులకు వివరించనుంది.
Read More »మద్యం ప్రియులకు శుభవార్త
దేశంలోని మద్యం ప్రియులకు శుభవార్త.. అదేంటంటే పెట్రోల్, డీజిల్ తరహాలోనే మద్యంపై 100శాతం అగ్రి ఇన్ ఫ్రాస్టక్చర్ అండ్ డెవలప్ మెంట్ సెస్ (AIDC) విధించిన కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా ధరల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఇంపోర్టెడ్ మద్యంపై 150శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తుండగా.. దాన్ని 50శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మద్యంపై కస్టమ్స్ డ్యూటీ, AIDC కలిపి మొత్తంగా 150శాతానికే పరిమితం అవుతుందని …
Read More »‘కివీ’ తో ఉపయోగాలు తెలుసా..?
‘కివీ’ ఉపయోగాలు ఎంటో ఒక లుక్ వేద్దాం రక్తసరఫరా మెరుగుపడుతుంది దగ్గు, జలుబు తగ్గిస్తుంది రక్తపోటు నియంత్రణలో ఉంటుంది ఆస్తమాను నివారిస్తుంది ఈ పండు గర్భిణీ స్త్రీలకు మంచి పౌష్టికాహారంగా ఉండటమే కాకుండా, కడుపులోని బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది మానసిక వ్యాధులను అరికడుతుంది అధిక బరువు తగ్గిస్తుంది
Read More »కొత్త పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ బడ్జెట్ లో కొత్తగా పీఎం ఆత్మనిర్భర ఆరోగ్య పథకం’ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.64,180 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఈ మొత్తంతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు అటు దేశంలో కొత్తగా 4 ప్రాంతాల్లో వైరాలజీ ల్యాబులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం పుణెలో మాత్రమే ఈ తరహా ల్యాబ్ ఉంది.
Read More »రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త
వన్ నేషన్-వన్ కార్డును ఈ ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వన్ నేషన్-వన్ కార్డు విజయవంతంగా అమలవుతోందని నిర్మలా చెప్పారు.
Read More »కేంద్ర బడ్జెట్ 2021-22-మొబైల్ వినియోగదారులకు షాక్
కేంద్ర బడ్జెట్ లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పై 2.5% కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు పెరగనున్నాయి. అటు కార్ల విడిభాగాల ధరలు కూడా పెరగనున్నాయి. ఇదే సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుతాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ బడ్జెట్ అమలులోకి రానుండగా.. అప్పటి నుంచి ధరలు పెరుగుతాయి.
Read More »