ఇన్నాళ్లూ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సంతకం చేశారు. పదోన్నతుల కల్పనకు ఉద్యోగుల కనీస సర్వీసు సమయాన్ని ప్రభుత్వం కుదించింది. కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా స్థాయిలోని వివిధ శాఖలు, కేటగిరీల్లో ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను ఇటీవల సీఎం ఆదేశించారు. …
Read More »గ్రేటర్ హైదరాబాద్ లో ఉచిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్లో ఉచిత తాగునీటి పథకం ప్రారంభమైంది. రహ్మత్నగర్లోని ఎస్పీఆర్ హిల్స్లో ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి జీరో నీటి బిల్లులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ మహముద్ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ సీహెచ్ మల్లారెడ్డి, ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ మాగంటి గోపినాథ్, శ్రీ దానం నాగేందర్, …
Read More »ఈనెల 16 నుంచి తెలంగాణలో వ్యాక్సినేషన్
తెలంగాణలో ఈనెల 16 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వ్యాక్సినేషన్ తర్వాత రియాక్షన్ ఉంటే వైద్య చికిత్స అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలకు కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. వ్యాక్సిన్ వేయించే బాధ్యత సర్పంచ్లు, కార్యదర్శులు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. ముందుగా ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది, పోలీసు, భద్రతా బలగాలకు టీకా వేయనున్నారు. ఆ తర్వాత 50ఏండ్లు పైబడిన, దీర్ఘకాలిక వ్యాధులతో …
Read More »హనుమ విహారి, అశ్విన్ జోడీ.. ఆ ఇద్దరినీ గుర్తు చేసిందా?
ఆసీస్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ చేజారకుండా.. టీమిండియా ఆటగాళ్లు హనుమ విహారి, అశ్విన్ అద్భుత పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. వీరి పోరాటం కారణంగా మూడో టెస్ట్ డ్రా అయ్యింది. 272 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో.. హనుమ, అశ్విన్ ఇద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా వికెట్లకు అడ్డుపడ్డారు. ఈ ఇద్దరూ.. నాటి లక్ష్మణ్, ద్రవిడ్ జోడీని గుర్తు చేశారు. వీరిద్దరూ కలిసి 258 బంతులాడి 62 …
Read More »ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆస్తులు ఎంతో తెలుసా..?
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదివారం తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. భువనేశ్వర్, దిల్లీ, ఫరీదాబాయ్లో తన తండ్రి, మాజీ సీఎం బీజు పట్నాయక్ ద్వారా లభించిన ఆస్తులు.. తాను రచించిన పుస్తకాల రాయల్టీ ద్వారా సంపాదించిన మొత్తం 2020 మార్చి నాటికి సుమారు రూ 63 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. ఆయా వివరాలను త్వరలో లోకాయుక్తకు అందజేస్తానని చెప్పిన ఆయన.. తన మంత్రివర్గంలోని పలువురి ఆస్తులను సైతం ప్రకటించారు
Read More »బీజేపీ నేతలపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అభివృద్ధిపై భాజపా నేతలు దేవాలయాల్లో ప్రమాణాలు ఆపేసి అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందిస్తుందే తప్ప… పైసా సాయం చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కోరినా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు.
Read More »హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు మాస్ మ్యూచువల్ సంస్థ ప్రకటించింది. అమెరికా వెలుపల రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
Read More »జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీ పేరు ఇదేనా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై కొత్త వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మధ్య ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వినిపించాయి. తాజాగా ‘చౌడప్పనాయుడు’ పేరు తెరపైకి వచ్చింది. ఈ టైటిల్ ను చిత్రబృందం పరిశీలిస్తోందని ఊహాగానాలు సాగుతున్నాయి. మరి ఇందులో నిజమెంతో …
Read More »మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు బెయిల్ నిరాకరణ
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రవీణ్ రావు కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి,టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియకు బెయిల్ నిరాకరించింది. సికింద్రాబాద్ కోర్టు. 3 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది అఖిలప్రియ. సీన్ రీ- కక్షతో పాటు, కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కోర్టు బెయిల్ …
Read More »ఇషా డియోల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్
బాలీవుడ్ నటి ఇషా డియోల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు. దీంతో వెంటనే తన ఫాలోవర్స్కు ఇషా హెచ్చరికలు జారీ చేసింది. నా ప్రొఫైల్ నుండి ఎలాంటి మెసేజ్లు, పోస్ట్లు వచ్చిన స్పందించొద్దు అని స్పష్టం చేసింది. అంతేకాక తన ట్విట్టర్లో పలు స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేసింది. ఇటీవలి కాలంలో ఆషా బోస్లే, ఊర్మిళ మటోడ్కర్, సుషానే ఖాన్, విక్రాంత్ మస్సే, ఫరా ఖాన్ సోషల్ మీడియా …
Read More »