కరోనాతో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో చేనేత, టెక్స్టైల్, అపారెల్ పరిశ్రమలకు 50 శాతం సబ్సిడీపై నూలు (యార్న్) అందజేయాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే రెండేండ్లపాటు చేనేతవస్ర్తాలపై పూర్తిస్థాయి జీఎస్టీ మినహాయింపులను పరిశీలించాలని సూచించారు. లక్షల మందికి ఉపాధి కల్పించే చేనేత, టెక్స్టైల్, అపారెల్ పరిశ్రమలను ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఈ రంగంపై ఆధారపడినవారికి భరోసా కల్పించేందుకు తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర …
Read More »హాట్ యాంకర్ కు బాలీవుడ్ ఆఫర్.!
బుల్లితెరకి గ్లామర్ అద్దిన అందాల యాంకర్ అనసూయ. ఒకవైపు యాంకర్గా చేస్తూనే అడపాదడపా ముఖ్య పాత్రలు చేస్తుంది. అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది. ప్రస్తుతం అనసూయకి హీరోయిన్కి ఉన్నంత క్రేజ్ ఉంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రతో నటిగా మంచి మార్కులు కొట్టేసిన అనసూయ ఇప్పుడు చిరంజీవి తాజా చిత్రం ఆచార్యలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు టాలీవుడ్కే పరిమితమైన అనసూయకి బాలీవుడ్ నుండి బంపర్ ఆఫర్ వచ్చినట్టు …
Read More »వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా సమగ్ర వ్యవసాయ విధానానికి రూపకల్పనచేయాలని సీఎం కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు పండించే విధంగా రైతుల దృక్పథంలో మార్పు తీసుకొనిరావాలని కేసీఆర్ కోరారు. త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు, రైతుబంధు సమితులు, వ్యవసాయాధికారులతో మాట్లాడుతానని వెల్లడించారు. శనివారం ప్రగతిభవన్లో వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో …
Read More »లాక్డౌన్ వేళ.. ఆన్లైన్ ప్రేమ
లాక్డౌన్ పుణ్యమా అని యువకులు రోడ్ల మీదికొచ్చి ‘ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా’ అంటూ నెచ్చెలి కోసం వెతికే పరిస్థితి లేదు. ‘ఇతడే.. నే కలగన్న నా వరుడు’ అంటూ యువతులు మనసుపారేసుకునే అవకాశం లేదు. అందుకే ప్రేమ కోసం ‘ఆన్లైన్’ బాట పట్టారు. లాక్డౌన్తో కలిగిన ఒంటరితనాన్ని డిజిటల్ ప్రేమతో చెరిపివేసేందుకు తాపత్రయపడుతున్నారు. ఇదే అదునుగా డేటింగ్ యాప్లు సైతం కొత్త కొత్త ఫీచర్లతో ముందుకొస్తున్నాయి. ఫలితంగా రెండు నెలలుగా …
Read More »జర్నలిస్టులకు అండగా కమల్ హసన్
కరోనా సంక్షోభంతో ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. రోజువారి ఉపాధి లేని వారు కడుపు నింపుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. అయితే ఈ కరోనా సమయంలోను తమ ప్రాణాలని పణంగా పెట్టి విధులని నిర్వహిస్తున్నజర్నలిస్ట్లు కూడా కొంత ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించిన కమల్ వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కరోనా వైరస్ కొందరి జర్నలిస్ట్లపై కూడా పంజా విసిరింది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో ఒక్కొక్కరికి …
Read More »జీహెచ్ఎంసీ అలెర్ట్.. నిబంధనలు పాటించకుంటే సీజ్
లాక్డౌన్ ఉల్లంఘనల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా జిమ్లు, ఇనిస్టిట్యూట్లు, స్టడీ రూమ్లు, స్పోర్ట్స్ క్లబ్లు, ఫిట్నెస్ స్టూడియోలు, బార్ అండ్ రెస్టారెంట్లు తెరుస్తోన్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అనుమతి ఉన్న దుకాణాలు, సంస్థల వద్ద భౌతికదూరం, మాస్క్ ధరించడం తదితర నిబంధనలు పాటించకున్నా సీజ్ చేయనున్నారు. సోమవారం నుంచి గ్రేటర్వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించనున్నట్టు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. ఇప్పటికే …
Read More »వయస్సు 70.. నలుగురు భార్యలు.. యువతిపై దారుణం!
ఓ వైపు కరోనా.. మరోవైపు లాక్డౌన్ సమయంలో హైదరాబాద్లో ఓ దారుణం వెలుగు చూసింది. 70 ఏళ్ల వృద్ధుడు.. ఆయనకు నలుగురు భార్యలు. అయినా అమ్మాయిలు అంటే పిచ్చి.! ఓ అమ్మాయికి ఆర్థికసాయం చేస్తానంటూ నమ్మించి.. ఇంటికి పిలిపించి మత్తుమందు ఇచ్చి ఆపై అత్యాచారానికి పాల్పడిన ఘటన బయటపడింది. అసలేం జరిగింది..? ఎవరీ వృద్ధ కామాంధుడు అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అసలేం జరిగింది!? బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో …
Read More »బాబు నిర్వాకం.. విశాఖకు శాపం
విష వాయువు లీకేజీతో 12 మందిని పొట్టన పెట్టుకున్న ఎల్జీ పాలిమర్స్కు ఊపిరి పోసిందెవరు? అసలు ఆ సంస్థకు మొదటి నుంచి అండగా నిలిచిందెవరు? కంపెనీ విస్తరణకు సహకారాలు అందించిన వారెవరు? అడ్డగోలుగా ఆ సంస్థకు వెన్నుదన్నుగా ఉన్నదెవరు? ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పూర్వాపరాలు, భూభాగోతాలు పరిశీలిస్తే.. పై ప్రశ్నలన్నింటికీ పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వమేనని స్పష్టమవుతోంది. జనావాసాల మధ్య ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఈ ఫ్యాక్టరీ విస్తరణ, …
Read More »తెలంగాణలో 1096 మందికి కరోనా
మానవ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా.. తెలంగాణ ప్రజల్ని కూడా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 1096 కరోనా పాజిటవ్ కేసులు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. మొత్తం 628 మంది డిశ్చార్జి అయ్యారని.. మంగళవారం 43 మంది పేషెంట్లు డిశ్చార్జి అయ్యారన్నారు. మంగళవారం 11 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 439 మంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. …
Read More »తెలంగాణలో పదో తరగతి పరీక్షలు తేది ఖరారు
తెలంగాణ హైకోర్టు నిబంధనల మేరకు టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్ష కేంద్రాలు పెంచి టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. భౌతికదూరం పాటిస్తూ, హాళ్లను శానిటైజ్ చేస్తూ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ నెలలోనే టెన్త్ పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ మే 6 (బుధవారం) …
Read More »