మహానటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. బీజేపీ నేతకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన తనయుడ్ని కీర్తి వివాహమాడబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇరు కుటుంబాలు ఇప్పటికే అన్ని విషయాలు మాట్లాడుకున్నారని.. పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకునేందుకు కీర్తి కూడా ఒప్పుకుందని తెలుస్తోంది. వివాహ వేదిక, పెళ్లి తేదీ తదితర విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరి ఇందులో …
Read More »కార్యాలయాన్ని ఇచ్చిన షారుక్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతులు తమ ఆఫీస్ను క్వారంటైన్ ఫెసిలిటీగా మలిచారు. నాలుగు అంతస్థుల కార్యాలయాన్ని కరోనా స్వీయ నిర్బంధ కేంద్రంగా ఉపయోగించుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) అప్పగించారు. ఈ ఆఫీస్లో చిన్నారులకు, మహిళలకు, పెద్దలకు సాయం అందించే దిశగా చర్యలు చేపట్టారు.
Read More »దేశంలో కరోనా విజృంభణ
దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది.నిన్న శుక్రవారం ఒక్కరోజే 647కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృవీకరించింది. గత రెండు రోజుల్లో ఢిల్లీ మర్కాజ్ తో సంబంధాలున్న 647కేసులను గుర్తించాము.అండమాన్ నికోబార్,అస్సాం,ఢిల్లీ,హిమాచల్ ప్రదేశ్ హర్యానా,జమ్ము & కాశ్మీర్,జార్ఖండ్,కర్ణాటక,మహారాష్ట్ర,రాజస్థాన్,తమిళనాడు,తెలంగాణ,ఏపీ,ఉత్తరాఖండ్,యూపీల నుండే ఈ కేసులు నమోదయ్యాయి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో 2301కేసులు నమోదయ్యాయి.ఇందులో యాబై ఆరు మంది మృతి చెందారు.
Read More »తమిళనాడులో కరోనా కలకలం
తమిళనాడు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది.శుక్రవారం ఒక్కరోజే 102కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం రోజు 110కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.తాజాగా నమోదైన కరోనా పాజిటీవ్ కేసులతో మొత్తం 411కి చేరుకుంది. మరోవైపు ఇరవై నాలుగంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో 91కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 384కి చేరుకుంది.ఇందులో ఎక్కువ కేసులు అనగా 259మంది ఢిల్లీ మర్కాజ్ కి చెందినవారవడం విశేషం.
Read More »పెన్షన్ దారులకు శుభవార్త
ఏపీలోని పెన్షన్ దారులకు ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగ్మోహన్ రెడ్డి శుభవార్తను తెలిపారు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఏపీకి చెందిన పలువురు పెన్షన్ దారులు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. దీంతో ఈ నెల ప్రభుత్వం ఇస్తున్న పంపిణీ తీసుకోవడంలో వీళ్లు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా ఈ నెల పించన్ ను తీసుకోనివారు వచ్చే …
Read More »తెలంగాణలో ఒక్కరోజే 75 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్కరోజు డెబ్బై ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229కి చేరుకుంది.మరోవైపు ఈ రోజు పదిహేను మంది కరోనా కు చికిత్స పొంది పూర్తిగా నయమై డి శార్జ్ అయి ఇంటికెళ్ళారు. మరోవైపు కరోనా కారణంగా ఇవాళ ఒక్కరోజే ఇద్దరు మృత్యువాత పడ్డారు .ఇప్పటివరకు ముప్పై రెండు మంది పూర్తిగా నయమై …
Read More »రూ.50లక్షల చెక్ ను అందజేసిన బాలయ్య
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,స్టార్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ కరోనా బాధితుల సహాయార్థం ఏపీ,తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి చెరో యాబై లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించిన రూ.యాబై లక్షల చెక్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ కు ప్రగతి భవన్లో అందజేశారు.తెలంగాణలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం.. తెలంగాణ దేశానికి …
Read More »ఏపీ సర్కారు సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ మర్కాజ్ కు చెందిన కేసుల వలన రాష్ట్రంలో కరోనా తీవ్ర రూపం దాల్చడంతో సర్కారు ,ప్రయివేట్ వైద్య సర్వీసుల(వైద్యులు,నర్సులు,ఆరోగ్య పారిశుధ్య కార్మికుకుల)ను ఎస్మా పరిధిలోకి తీసుకువస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే …
Read More »కరోనా రాకుండా కొన్ని సలహాలు
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ కరోనా వైరస్ తీవ్ర భయాందోళనను కలిగిస్తుంది.ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుంది.ఈ నేపథ్యంలో కరోనా రాకుండా ఏమి చేయాలో కొన్ని సూచనలను ,సలహాలను తెలుసుకుందాం. * దగ్గు,తుమ్ములతో వచ్చేతుంపర్లతో కరోనా వస్తుంది కాబట్టి ఇవి వచ్చేటప్పుడు నోటికి,ముక్కుకు అడ్డుగా రుమాలు కానీ టిష్యూ కానీ పెట్టుకోవాలి * ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి * ఇతర ఆరోగ్య సమస్యలుంటే …
Read More »తెలంగాణలో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా
తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్కరోజు శుక్రవారం నాడు డెబ్బై ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229కి చేరుకుంది.మరోవైపు శుక్రవారం రోజు పదిహేను మంది కరోనా కు చికిత్స పొంది పూర్తిగా నయమై డి శార్జ్ అయి ఇంటికెళ్ళారు. మరోవైపు కరోనా కారణంగా శుక్రవారం ఒక్కరోజే ఇద్దరు మృత్యువాత పడ్డారు .ఇప్పటివరకు ముప్పై రెండు మంది పూర్తిగా నయమై …
Read More »