నారాయణఖేడ్ మండలంలోని సంజీవనరావుపేట్ గ్రామంలో తెలంగాణ పౌరసరపరాల శాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కేసిఆర్ గారిది రైతు ప్రభుత్వం అని ప్రతి పంటను రైతు మద్దత్తు ధర ఇచ్చి రైతులకు అన్ని విధాలుగా తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.మద్దత్తు ధర A గ్రేడ్ 2060,కామన్ …
Read More »ఏపీలో తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభం..!
ఏపీలో జగన్ సర్కార్ ఫిబ్రవరి నుంచి సామాజిక పింఛన్లను లబ్దిదారుల ఇంటి దగ్గరకే పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ నెల కూడా పింఛన్లను లబ్దిదారులకు వారి ఇంటి దగ్గరే అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 58.99లక్షల పింఛన్ లబ్ధిదారులకు ఈ తెల్లవారుజామునుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. అదివారం సెలవు రోజు అయినప్పటికీ పింఛన్దారులకు వారి ఇంటి వద్దే డబ్బులు అందజేసేందుకు …
Read More »అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్పై సిట్ దర్యాప్తు షురూ… పలు కీలక ఆధారాలు లభ్యం..బాబు బ్యాచ్ బేజారు..!
టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై జగన్ సర్కార్ నియమించిన సిట్ బృందం పని మొదలుపెట్టింది. తొలుతగా అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్పై సిట్ ఫోకస్ పెట్టింది. తాజాగా సిట్ ప్రత్యేకాధికారి, ఇంటెలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి బృందం విజయవాడలో మెరుపు దాడులు నిర్వహించింది. రాజధానిలో తెల్లకార్డులతో భూములు కొనుగోలు చేసిన పేదల వెనుక ఉన్న బినామీల గుట్టు విప్పేందుకు టీడీపీ నేతలకు చెందిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. అలాగే విజయవాడ …
Read More »నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి హిందూ ధర్మ ప్రచారయాత్ర…!
విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర ఆదివారం నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఈయాత్ర 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జిల్లాలో ఉంటుంది. హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా స్వామీజీ జిల్లాలోని పుణ్యక్షేత్రాలతో పాటు హరిజనవాడలను కూడా సందర్శిస్తారు. విద్యాసంస్థలకు వెళ్లి విద్యార్థులకు హైందవ ధర్మం ప్రాధాన్యతను వివరిస్తారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం హైందవ సంప్రదాయాలను ప్రబోధిస్తూ ముందుకు …
Read More »జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..!
జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు ఐదు దశలలో జరగనున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటలకే ముగించనున్నారు. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. అధికార పార్టీ అయిన బిజెపి తొలి దశలో 12 స్థానాల్లో పోటీకి దిగింది. ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. ప్రతిపక్ష …
Read More »ఇకపై వెబ్ సిరీస్ లో అలరించనున్న సమంత.. ఎందుకంటే.?
వరుస హిట్లతో, వైవిధ్యభరితమైన పాత్రలతో సమంతా అగ్ర నటిగా కొనసాగుతుంది. అయితే కమర్షియల్ పాత్రల్లోనే కాకుండా తనకు నచ్చిన పాత్రల్లోనే నటించాలనుకున్నట్లు సామ్ ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగానే ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ హిందీ వెబ్ సిరీస్లో నటించనుంది. మొదటిసారిగా వెబ్ సిరీస్లో నటించడమే కాక తొలిసారిగా నెగెటివ్ రోల్ చేయనున్నది. సెప్టెంబర్లో విడుదలైన ద ఫ్యామిలీ మెన్కు సీక్వెల్గా ఫ్యామిలీ మెన్ …
Read More »హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో విస్తరించిన ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించిన సీఎం జగన్
తాజాగా 130 ఆస్పత్రుల్లో గుర్తించిన సూపర్ స్పెషాలిటీ సేవలను సీఎం వైయస్.జగన్ ప్రారంభించారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అందుబాటులోకి 17 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 716 వైద్యప్రక్రియలు జరగనున్నాయి.చెన్నైలోని ఎంఐఓటీ, బెంగుళూరులోని ఫోర్టిస్, హైదరాబాద్లోని మెడ్కవర్ ఆస్పత్రి డాక్టర్లు, అక్కడ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి మాట్లాడారు.చికిత్సల విధానంపై డాక్టర్లను ముఖ్యమంత్రి వైయస్.జగన్ అడిగి తెలుసుకున్నారు.తమ రాష్ట్రానికి చెందిన వారిని బాగా చూసుకోవాలంటూ వైద్యులను కోరారు.ఎంతో విశ్వాసం, నమ్మకంతో …
Read More »నేటి నుంచి తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభం..!
వైవి సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమల తిరుపతిలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నారు. ముందుగా ఎల్1, ఎల్2, ఎల్3 బ్రేక్ దర్శనాలు రద్దు చేసి, భగవంతుడి ముందు ప్రతి ఒక్కరూ సమానమే అన్నారు. అలాగే 60 ఏళ్లు దాటిన వృద్ధులకు కేవలం 30 నిమిషాల్లో శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. తాజాగా శ్రీ వాణి ట్రస్ట్ ప్రారంభించి, రూ. 10 వేలు విరాళం ఇచ్చిన ప్రతి భక్తుడికి …
Read More »భాగ్యనగరంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి ధర్మ ప్రచారయాత్ర..ఆశీస్సులు తీసుకున్న ప్రముఖులు..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హిందూ ధర్మ ప్రచారయాత్ర హైదరాబాద్లో దిగ్విజయవంతంగా సాగుతోంది. ధర్మప్రచార యాత్రలో భాగంగా జూబ్లిహిల్స్ లోని జలవిహార్ రామరాజు దంపతుల నివాసంలో స్వామివారు స్వయంగా శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు, అర్చనాది కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి, శుభాశీస్సులు అందజేశారు. రామరాజు నివాసంలో బస చేసిన స్వామివారిని సినీ దర్శకుడు, ఎస్వీబీసీ …
Read More »జగయ్యపేటలో గాంధీ సంకల్పయాత్ర ప్రారంభించిన బీజేపీ ఎంపీ..!
ఒకప్పటి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, (ఇప్పుడు కూడాలెండి), ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనాచౌదరి గారి చిత్రవిచిత్ర విన్యాసాలు చూసి ఏపీ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. బ్యాంకులకు 6 వేల కోట్లు ఎగ్గొట్టి, మనీల్యాండరింగ్ కేసుల్లో ఇరుక్కుని కేసుల భయంతో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఈ సుజనాచౌదరి గారు ఇప్పుడు జగ్గయ్యపేటలో మదిలో మహాత్ముడి పేరిట గాంధీ సంకల్పయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా సుజనాచౌదరి గారు ప్రాంతీయ పార్టీల గురించి …
Read More »