తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అంటే ఆయన ఎక్కడ ఏ సభ అయిన సరే ఒక చిన్న పిల్లాడి మాదిరిగా మారిపోయి సభికులను అందర్నీ ఆనందంగా ఉంచడానికి ఉత్సాహభరితమైన ప్రసంగాలతో.. తీరైన డాన్సులతో అందరి మన్నలను పొందుకుంటారు అని మనకు తెల్సిందే. అయితే తాజాగా మంత్రి మల్లారెడ్డి చేసిన పనికి యావత్తు నెటిజన్ లోకం ఫిదా అయింది. నిన్న సోమవారం హైదరాబాద్ మహానగరంలోని బాలానగర్లో నర్సాపూర్ …
Read More »టీసర్కారు శుభవార్త..!
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం తర్వాత రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు శుభవార్తను ప్రకటించింది. ఈ సీజన్లో రైతాంగానికి రైతుబంధుకు సంబంధించిన నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కారు. ఇందుకు సంబంధించిన రూ.6900కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ రోజు సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. ఈఏడాది నుంచి ఒక ఎకరానికి రూ పదివేల చొప్పున రైతుబంధు పథకం అమలు …
Read More »పోచంపల్లికి అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్..
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ లు గా ఎంపికైన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలకు ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఏకపక్ష విజయాన్ని అందించిన స్థానిక సంస్థల ప్రతినిధుల కు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. టిఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులకు ముఖ్యమంత్రి …
Read More »స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్స్వీప్..!!
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం మూడు ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాలకు గాను మూడిట్లో ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భాగంగా వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగగా.. కాంగ్రెస్ అభ్యర్థి ఇనుగాల వెంకట్రామ్ రెడ్డిపై 827 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మరోవైపు నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డిలక్ష్మిపై టీఆర్ఎస్ అభ్యర్థి చిన్నపరెడ్డి 226 ఓట్ల ఆధిక్యంతో …
Read More »ఎమ్మెల్యే కోటాలో”ఎమ్మెల్సీ”ఏకగ్రీవం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుర్మయ్యగారి నవీన్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నవీన్రావు ఎన్నిక ధ్రువపత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి అందజేశారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు.
Read More »కేసీఆర్, జగన్ ఢిల్లీ వెళ్లకపోవడానికి కారణం తెలుసా.?
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం అనంతరం ఇద్దరూ విమానంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా అకస్మాత్తుగా వారి పర్యటన రద్దు అయ్యింది. మోడి ప్రమాణస్వీకారానికి జగన్, కేసీఆర్ లకు ఆహ్వానాలు అందాయి. దీంతో ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళదాం అనుకున్నారు. కానీ వారి పర్యటన రద్దయ్యింది. ఢిల్లీలో విమానం ల్యాండింగ్ కి …
Read More »మోడి ప్రమాణ స్వీకారానికి తెలుగురాష్ట్రాల సీఎంలు ఎందుకెళ్తున్నారంటే.?
దేశంలో సంచలన విజయం సాధించిన బీజేపీ మరోసారి భారతదేశ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. భారత ప్రధాని నరేంద్రమోడి కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న వారికి ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) నుండి ఫోన్కాల్స్ అందాయి. పిఎంఒ ఫోన్లు చేసిన వారిలో తెలంగాణనుంచి కిషన్ రెడ్డి, కర్ణాటకనుంచి సదానంద గౌడ ఉన్నారు. నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, అనుప్రియ పటేల్, రాందాస్ అథావలే, మిత్రపక్ష నేత …
Read More »రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున నిలబడిన అనుముల రేవంత్ రెడ్డి మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు అనుముల రేవంత్ రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో …
Read More »నూతన ఒరవడికి టీ సర్కారు శ్రీకారం..!
నేటి ఆధునిక యువతలో సామాజిక చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చదువుతోపాటు సేవా కార్యక్రమాలు కూడా జీవితంలో భాగమని యువతకు దిశానిర్దేశం చేసేందుకు గాను తాజాగా యువ చేతన పేరుతో సరికొత్త కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 15-35 సంవత్సరాల్లోపు ఉన్న యువజనులతో(అమ్మాయిలు, అబ్బాయిలు) యువజన క్లబ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కరు ఆర్గనైజర్గా, మరొక్కరు డిప్యూటీ ఆర్గనైజర్లుగా …
Read More »ఏపీకి సీఎం కేసీఆర్..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తిరుమల తిరుపతికి వెళ్లనున్నారు. సతీసమేతంగా సీఎం కేసీఆర్ ఈ రోజు ఆదివారం మధ్యాహ్నాం తిరుపతికి బయలుదేరి వెళ్లనున్నారు.ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి తిరుపతికి బయలుదేరతారు. రేపు సోమవారం తిరుమల తిరుపతి దేవాలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం అవుతారు..
Read More »