తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ శాఖల్లో 10వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తేల్చారు అధికారులు ఇందులో గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులు 7వేలకు మించి ఉన్నాయి. త్వరలో 50వేల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న సర్కార్ నిర్ణయం మేరకు ఖాళీలను గుర్తించి వివరాలు సిద్ధం చేశారు. ఇక రాష్ట్రంలో వైద్య, పంచాయతీ గురుకుల, పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆయా శాఖల పరిధిలో.. మిగతా శాఖల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు
Read More »చెత్తను తరలించేందుకు స్వచ్ఛ ఆటోలు -మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే 2500 స్వచ్ఛ ఆటోలు నడుస్తున్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. గురువారం ఉదయం కెటిఆర్ స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా 325 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెత్తను తరలించేందుకు ఇంతవరకు ఉన్న పాత వాహనాలకు స్వస్తి పలికి స్వచ్ఛ ఆటోలను నడిపిస్తున్నామని ఆయన చెప్పారు. ఒక్కో స్వచ్ఛ ఆటో 1.5 మెట్రిక్ టన్నుల గార్బేజ్ ను తరలిస్తుందని ఆయన పేర్కొన్నారు. …
Read More »నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా రైతు వేదికలు : మంత్రి నిరంజన్ రెడ్డి
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రైతు వేదికల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,596 రైతు వేదికలు నిర్మించామని తెలిపారు. రైతు వేదికల నిర్మాణాల కోసం రూ. 572 కోట్ల 22 లక్షల మొత్తాన్ని ఖర్చు చేశామన్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖల ద్వారా ఆధునిక వ్యవసాయ సమాచారం, అవగాహన కల్పించడం కోసం, నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా …
Read More »టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 2 లక్షల 13 వేల 431 కోట్ల పెట్టుబడులు
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఎస్ ఐపాస్ కింద వచ్చిన పరిశ్రమలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత గత ఆరు సంవత్సరాల్లో టీఎస్ ఐపాస్ కింద 15,326 పరిశ్రమలు ఆమోదం పొందాయన్నారు. ఇందులో ఇప్పటికే 11,954 పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 2 లక్షల 13 వేల 431 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. కాగా ప్రస్తుతం …
Read More »హైదరాబాద్లో తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు పూర్తి..
మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఏడు రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప రామచందర్రావుపై 8,021 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏడు రౌండ్లలో కలిపి టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,12,689 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రామచందర్రావుకు 1,04,668 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్రావుకు 53,610 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554 ఓట్లు, టీడీపీ …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్
తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీకి మంచి అండగా ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని తెలిపారు. ఏఐసీసీ నుంచి రాష్ట్ర నాయకత్వం వరకూ ప్రభుత్వంతో అమీతుమీ పోరాటం చేయట్లేదన్న అసంతృప్తితోనే ఆయన …
Read More »గొప్ప మనస్సును చాటుకున్న మంత్రి కేటీఆర్
తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు, డాక్టర్ కొల్లూరి చిరంజీవి కి వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. పది లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తక్షణమే విడుదల చేసింది. ఈ మేరకు మున్సిపల్ , ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ , డా. చిరంజీవి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. ఆరోగ్యం విషమంగా ఉంది. వో ప్రైవేట్ దవాఖాన లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని …
Read More »కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ భరోసా
జీతం జానెడు.. చాకిరీ బారెడు.. ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్గా పనిచేస్తున్న చిరుద్యోగుల్లో తరుచూ వినిపించిన మాట. చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేయలేక.. వాటిని విడువలేక ఆయా కుటుంబాలు పడిన బాధలెన్నో. స్వరాష్ట్రంలో వారి జీవితాల్లో వెలుగులు నిండాయి.ఉమ్మడి రాష్ట్రంలో ఇటు వేతనం, అటు భద్రత కరువైన చిరుద్యోగుల చింత తీర్చింది తెలంగాణ ప్రభుత్వం.చాలీచాలని వేతనాలతో కుటుంబపోషణ భారమైన వారి జీవితాల్లో వెలుగులు నింపింది. ప్రభుత్వం ఎప్పుడూ పైస్థాయి …
Read More »మాస పత్రికను ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
ప్రతి అక్షరం ప్రజల పక్షాన ఉండాలని తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు అన్నారు. గురువారం సికింద్రాబాద్ లో శ్రీవెన్ టైమ్స్ మాస పత్రిక ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీ. పద్మారావు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించే వేదికగా ఈ మాస పత్రిక పత్రిక ఉండాలని ఆకాంక్షించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా నిలవాలని కోరారు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ పత్రిక వేదిక …
Read More »దళితులు సంపూర్ణ సాధికారతే మా లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలో దళితులు సంపూర్ణ సాధికారత సాధించాల్సిన అవసరం ఉందని సీఎం కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులు వెనుకబడి ఉన్నారని, వారిని బాగుచేసుకొనే బాధ్యత మనదేనని చెప్పారు. దళితుల అభివృద్ధి కోసం సబ్ప్లాన్ తెచ్చి కొంత ప్రయత్నాలు చేశామని, ఇంకా చేయాల్సి ఉన్నదని అన్నారు. దళితుల కోసం ఈ సంవత్సరం బడ్జెట్లో ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీం’ పేరుతో వెయ్యి కోట్లు కేటాయించనున్నామని ప్రకటించారు. నల్లగొండ జిల్లా హాలియాలో …
Read More »