తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీకి మంచి అండగా ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని తెలిపారు.
ఏఐసీసీ నుంచి రాష్ట్ర నాయకత్వం వరకూ ప్రభుత్వంతో అమీతుమీ పోరాటం చేయట్లేదన్న అసంతృప్తితోనే ఆయన రాజీనామా చేసినట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎ్సతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఉండే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలోనే కాంగ్రె్సను వీడాలన్న నిర్ణయానికి కొండా విశ్వేశ్వర్రెడ్డి వచ్చినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి పలు ఆలోచనలు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీలోనే ఉండి వాటిపై కసరత్తు చేయడమూ సరైంది కాదన్న భావనలో పార్టీకి రాజీనామా చేసినట్లు సన్నిహితులకు ఆయన చెబుతున్నారు.