సోమవారం విడుదలైన గుజరాత్ ,మధ్యప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది .అయితే ఆ పార్టీ ఓడిన కానీ మంచి ఊరట నిచ్చే విజయం దక్కింది .పంజాబ్ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ విజయకేతనం ఎగరవేసింది .ఇదే ఏడాది మొదటిభాగంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఆ పార్టీ తాజాగా స్థానిక సంస్థల్లో గెలుపొందటం ఊరటనిచ్చే అంశం ..
రాష్ట్రంలో జలందర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో మొత్తం ఎనబై స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అరవై ఆరు ,బీజేపీ కూటమి 12 స్థానాల్లో గెలుపొందింది .పటియాలా మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో అరవై సీట్లకు కాంగ్రెస్ పార్టీ యాబై ఎనిమిది సీట్లలో కాంగ్రెస్ గెలిచింది .
అమృత సర్ కార్పోరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎనబై ఐదు స్థానాల్లో అరవై మూడు స్థానాల్లో గెలుపొంది రెండు రాష్ట్రాల్లో ఓడిపోయిన కానీ రానున్న పార్లమెంటు ఎన్నికల ముందు ఆ పార్టీ కార్యకర్తల్లో మంచి జోష్ ను నింపుకుంది ..