Home / 18+ / రెండు తెలుగురాష్ట్రాల్లో ఈ చిత్రానికి కనీస ఆదరణ లేకుండా పోయింది..కారణం ఎవరు?

రెండు తెలుగురాష్ట్రాల్లో ఈ చిత్రానికి కనీస ఆదరణ లేకుండా పోయింది..కారణం ఎవరు?

నందమూరి బాలకృష్ణ స్వయంగా తన తండ్రి పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండో పార్ట్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే మొదటి భాగం కధానాయకుడు పేరుతో వచిన్న సినిమా భారీ అంచనాలతో విడుదలైన చివరకు సినీ యూనిట్ కు బోల్తాపడింది.ఇప్పుడు ఏ మాత్రం అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర కలెక్షన్లు దారుణంగా యూనిట్ ను నిరాశకు గురిచేశాయి.ఇక ‘ఓవర్‌-సీస్‌’ విషయానికి వస్తే ఇది ఒక పెద్ద అవమానమనే అనుకోవాలి,ఎందుకంటే అక్కడ ప్రీమియర్‌-షోస్‌ లో కేవలం లక్షా పద్నాలుగు వందల అరవై డాలర్ల మాత్రమే వచ్చినట్లు ప్రముఖ ట్రేడ్‌-అనలిస్ట్‌ జీవీవెల్లడించారు.

జనవరిలో రిలీజ్ ఐన మొదటి భాగం ప్రీమియర్‌-షోస్‌ కు నాలుగు లక్షలకుపైగా రాబట్టారు.అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ నిజజీవితంలో జరిగిన సంఘటనలు చూపించే ధైర్యం చిత్ర యూనిట్ కు లేదు అనే అభిప్రాయం ప్రజల్లో ముందే రావడం జరిగింది.దాని ప్రభావమే ఇప్పుడు కలెక్షన్స్ ధారుణంగా పడిపోవడానికి కారణమని తెలుస్తుంది.మొదటిరోజు వసూళ్ళు కేవలం ₹65లక్షల రూపాయలు మాత్రమే రావడం,తెలుగురాష్ట్రాల్లో మొత్తం కలిపి కనీసం కోటి రూపాయలు కూడా రాకపోవడం స్వర్గీయ ఎన్టీఆర్ కే అవమానంగా చెప్పుకోవాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat