తాజాగా ప్రధాని నరేంద్ర మోడి వీడియో ఒకటి వైరల్ అయ్యింది.. ఆవీడియోలో ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, మేకప్ కోసం మోదీ నెలకు 80 లక్షలు ఖర్చు చేస్తారని అని ఉంది. ఈ వీడియో ఫేస్బుక్ లోలక్షల్లో అయింది. విపక్ష పార్టీలన్నీ ఫేస్బుక్ పేజీల్లో ఈ వీడియో షేర్ చేశారు. అయితే ఈ వీడియో ఫేక్ అని తెలుస్తోంది. వాస్తవానికి వీడియో ఉన్నమాట నిజమైనా దానినుద్దేశించి ఉన్న సమాచారం మాత్రం అబద్ధమట. ఈ వీడియోలో పేర్కొన్నట్లు మోదీ మేకప్ ఆర్టిస్టులతో మేకప్ వేయించుకోవట్లేదు. 2016లో మోదీ మైనపు విగ్రహం తయారు చేసేందుకు మేడం టుసాడ్స్ బృందం ప్రధాని నివాసానికి వెళ్లింది. అక్కడే మోదీకి సంబంధించిన కొలతలను వారు తీసుకున్నారు. పైగా మోదీకి మేకప్ వేయట్లేదు.
మైనపు విగ్రహం తయారీ కోసం మోదీ ముఖం, శరీరం కొలతలను తీసుకున్నారు. నిజమైన వీడియో ఇప్పటికీ యూట్యూబ్ లో చూడొచ్చు. 2016 ఏప్రిల్ లో మోదీ మైనపు విగ్రహాన్ని లండన్లో ప్రతిష్ఠించారు. ఆ వివరాలు కూడా ఉన్నాయి, ఆర్టీఐ ద్వారా అందరూ తెలుసుకున్న సమాచారం ప్రకారం మోదీ తన మేకప్ కోసం నెలకు రూ.80 లక్షలు ఖర్చు చేశారని తేలిందని ఈ వీడియోలో పేర్కొన్నారు. ఇది అవాస్తవం.. మోదీపై వచ్చిన ఆర్టీఐ ప్రశ్నల గురించి ప్రధానమంత్రి అధికార వెబ్సైట్లో పరిశీలిస్తే అందులో మోదీ మేకప్ ఖర్చు వివరాలపై ప్రస్తావన లేదు.
మోదీకి విద్యార్హతలు, ఆయన పెట్టిన సెలవులు, ప్రధానమంత్రి కార్యాలయం వై-ఫై స్పీడ్, మోదీ రోజువారీ షెడ్యూల్ వివరాలున్నాయి. 2018లో వచ్చిన మీడియా కథనాల ప్రకారం, రోహిత్ సభార్వాల్ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా 1988 నుంచి ప్రధానమంత్రికి సంబంధించిన వార్డ్రోబ్పై ఎంత ఖర్చు చేశారనే ప్రశ్న అడగగా అయితే, దీనికి పీఎంవో ఇలాంటి వివరాలు వ్యక్తిగతమైనవి.. ఇవి అధికారిక రికార్డుల్లో ఉండవని స్పష్టం చేసింది. దీంతో వైరల్ అయిన 80 లక్షల వివాదం అవాస్తవమని తేలింది. అయితే మోదీ తన డ్రెస్సింగ్ కు, ఆహార్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తరన్న విషయం అందరికీ తెలిసిందే.