నవ్యాంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశం చాలా రసవత్తంగా జరుగుతున్నాయి. ఒక పక్క ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ గత ఐదేండ్లలో అప్పటి టీడీపీ ప్రభుత్వం చేసిన పలు అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడుతూ దుమ్ముదులుపుతుంది.ఈ క్రమంలో టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలు,మంత్రులపై ఎదురుదాడులకు దిగుతోంది.అయితే టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తోన్న దాడిని తిప్పికొడుతూ మరో ప్రక్క తాము ఏమి చేస్తామో పరోక్షంగా అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరిస్తుంది వైసీపీ ప్రభుత్వం. అందులో భాగంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ”గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో చేసిన అవినీతి అక్రమాలను బయటపెట్టారు”. ఆయన ఇంకా మాట్లాడుతూ” ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెప్పడానికి ఇక్కడ ఉంది మంగళగిరిని మందలగిరి అనే పప్పు కాదు డాక్టర్ .. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవాడు” అని మాజీ మంత్రి నారా లోకేశ్ నాయుడి గురించి ఆయన వేసిన పంచ్ అసెంబ్లీలో ఉన్న టీడీపీ సభ్యులకు దిమ్మతిరిగేలా చేసింది. ఆయన ఇంకా మాట్లాడుతూ”ఐదేండ్లలో టీడీపీ నేతలు అధికారాన్ని ,పదవులను అడ్డుపెట్టుకుని చేసిన ప్రతి అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తామని”అన్నారు.
Tags andhrapradesh andhrapradeshcm Anil Kumar Yadav appolitics chandhrababu cmo nara lokesh slider tdp ysrcp