గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు హయంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలుసు. మాయమాటలు చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి ఎలాగో గెలిచాడు. తీరా గెలిచాక అందరికి చుక్కలు చూపించాడు. ప్రభుత్వాన్ని తన సొంత ప్రయోజనాలు కోసం వాడుకున్నాడు తప్ప ప్రజలకు మాత్రం ఏమి చెయ్యలేదు. ఇక ఈ ఏడాది జగన్ ని నమ్మి గెలిపించిన ప్రజలు సరైన సీఎం ను ఎన్నుకున్నామని ఎంతో ఆనందంతో ఉన్నారు. పంటలకు వర్షాలు పడి, రైతులు పనులు చేసుకుంటున్నారు, మరో పక్క నిరుద్యోగులు పోటీ పరిక్షలు రాసుకుంటూ రాష్ట్రమంతా ప్రశాంతంగా ఎవరిపని వారు చేసుకుంటుంటే చంద్రబాబుకి అది నచ్చలేదేమో మరి పెయిడ్ అర్తిస్తులతో ఆ ప్రశాంతతను పోగొట్టాలని చూస్తున్నారని చంద్రబాబుపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని అన్నారు. పెయిడ్ ఆర్టిస్టు గుడారాలని పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారని అన్నారు. ఈసారి ఇలాంటివి జరిగితే క్షమించేది లేదని అన్నారు.