రానున్న దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్ధీని పరిగణలోకి తీసుకుని సికింద్రాబాద్ ,విజయవాడల మధ్య ,విజయవాడ-హైదరాబాద్ ల మధ్య సుమారు పద్దెనిమిది ట్రైన్స్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. అయితే ఈ రైళ్లల్లో అన్ని జనరల్ బోగీలే ఉండటం గమనార్హం .
సికింద్రాబాద్ నుంచి ఈ నెల రెండో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మధ్యహ్నాం పన్నెండు గంటలకు బయలుదేరే (రైలు నెంబర్ 07192) విజయవాడకు అదే రోజు రాత్రి 7గంటలకు చేరుకుంటుంది.
విజయవాడ నుంచి రాత్రి 8.15గంటలకు బయలుదేరే ఈ రైలు (నెంబర్ 07193) తర్వాత రోజు తెల్లారు జామున మూడు గంటలకు హైదరాబాద్ నాంపల్లికి చేరుకుంటుంది.