2014 ఎన్నికల్లో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో ముఖ్యంగా రైతుల కడుపు కొట్టాడు. రైతులను మభ్యబెట్టి చివరికి గెలిచాక వారి ఆత్మహత్యలకు కారణం అయ్యాడు చంద్రబాబు. వారి ప్రభుత్వం మాటలే చెబుతుంది తప్ప పనులు మాత్రం జరగవని గత పాలననో తేలిపోయింది. కాని ఇప్పుడున్న ప్రభుత్వం దానికి పూర్తి బిన్నంగా ఉందని చెప్పాలి ఎందుకంటే ఎన్నికలకు ముందు పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలకు తగ్గట్టుగా ఇప్పుడు పని చేయడమే దీనికి ముఖ్య ఉదాహరణ.
ఇక అసలు విషయానికి వస్తే జగన్ ఏలూరు వాసులకు చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకున్నాడు. అదేమిటంటే నగరంలో రూ.266కోట్లతో ఆధునిక ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించాలని పూనుకున్నాడు. ఈమేరకు ఈరోజు ఉదయం 10.30 నిమిషాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేసారు. ఇక నుండి ఈ ఆశుపత్రి పనులు వేగంగా జరగనున్నాయి..ఎందుకంటే జగన్ వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడమే దీనికి ముఖ్య కారణం. ఈమేరకు ప్రభుత్వం రూ.266 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి మొదటి ఏడాది 100 సీట్లు భర్తీ చేస్తారు. అనంతరం నాలుగేళ్ళలో విద్యార్ధులకు మౌలిక వసతుల కల్పన, హాస్టల్ ఏర్పాటుకు వంటివి పూర్తి చేస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గున్నారు.