బాలీవుడ్ ఒకప్పటి అందాల బ్యూటీ ,సీనియర్ నటి,బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గలపై బీజేపీ మంత్రి మరోసారి వివాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు కౌంటర్ ఇవ్వబోయిన ఎం.పీ రాష్ట్ర మంత్రి పీసీ శర్మ నోరు జారారు.
ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలోని రోడ్లు బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ బుగ్గల్లా ఉన్నాయి. ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఆదేశిలిచ్చిన పట్టు మని పదిహేను రోజుల్లో బీజేపీ ఎంపీ హేమమాలిని చెక్కిళ్లలా రోడ్లను మార్చేస్తాం అని అన్నారు. అయితే మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పీసీ శర్మ పై విమర్శల వర్షం కురుస్తుంది.