దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కానున్నదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. కాకపోతే ఇందులో ఓ ట్విస్ట్ ఉందట. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎత్తున ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. అయితే వారెవ్వరికి రాజీనామా చేయాలని చంద్రబాబు షరతు పెట్టలేదు. అయితే ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేలను వైసీపీలో చేరాలంటే రాజీనామా చేయాలని సీఎం జగన్ షరతు పెట్టడంతో జగన్ నిర్ణయాన్ని కాదనలేక ఎమ్మెల్యేలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే టిడిపిలో మనుగడ ఉండకపోవడం వైసీపీలో చేరేందుకు జగన్ ఒప్పుకోకపోవడంతో పదవులు వదులుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మళ్లీ ఎన్నికలు వచ్చి కొన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు, ఎన్నికల నోటిఫికేషన్ ఇవన్నీ ఉంటాయని జగన్ ఓకే చెప్తే మాత్రం వెళ్లిపోవాలని చూస్తున్నారు.
కొందరైతే రాజీనామాలకు సిద్ధం అవుతున్నారు. అయితే ఈ క్రమంలో మెజారిటీ ఎమ్మెల్యేలంతా తాము తమ పార్టీని టిడిపిలో విలీనం చేస్తామంటూ సిద్ధమవుతున్నారట. అంటే ప్రస్తుతం ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే ఇప్పటికే రాజీనామా చేయగా మిగిలిన 12 మంది ఎమ్మెల్యేలు తమను ప్రత్యేక ప్రాతిపదికన చూడాలని లేదా పార్టీ విలీనానికి సంబంధించి చ స్పీకర్ ముందుకు వెళ్ళనున్నారట. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోవడం కూడా ఖాయంగా కనిపిస్తోంది.