రకుల్ ప్రీత్ సింగ్ యువహీరో సరసన నటించి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన బక్కపలచు భామ. ఒకపక్క అందాలను ఆరబోసే పాత్రల్లో నటిస్తూనే మరో వైపు కథ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో చెరగని ముద్రవేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడ్ని ఒక బాధ ఎప్పటికి వెంటాడుతుంది అని చెప్పుకు వస్తూ ఉంది.
విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మంధాన హీరోయిన్ గా దర్శకుడు పరుశురామ్ నేతృత్వంలోని వచ్చిన గీతగోవిందం ఎంత ఘన విజయం సాధించిందో.. ఈ మూవీతో హీరోయిన్ గా రష్మిక మంధాన ఎంత ఎత్తుకు ఎదిగిందో మనకు తెల్సిందే. అయితే ఈ మూవీలో హీరోయిన్ రోల్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించింది అంట ఈ చిత్రం యూనిట్. అప్పుడు ఈ ముద్దుగుమ్మ డేట్స్ కుదరక నో చెప్పేసింది.
దీంతో ఈ మూవీలో నటించే అవకాశం కోల్పోయింది. ఈ మూవీలో నటించి ఉంటే అప్పటికే రకుల్ కున్న ఇమేజ్ తో మరింత టాప్ రేంజ్ కు చేరుకునేదని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అయితే అప్పటి నుండి ఈ ముద్దుగుమ్మ తెగ బాధపడుతుంది అంట. ఈ మూవీలో నటించనందుకు. దీనిపై అమ్మడు స్పందిస్తూ నటించనందుకు బాధపడకపోయిన కానీ ఆ మూవీలో నటించి ఉంటే బాగుండేది అని అన్పిస్తుందని లోలోపల బాధపడుతూ పైకి బాధలేదని చెప్పుకు వస్తుంది ఈ ముద్దుగుమ్మ.