తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఇంటెల్ డిజైన్ అండ్ ఇంజినీరింగ్ సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బెంగళూరు తర్వాత రెండో సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించిన ఇంటెల్.
దాదాపు 1500 మంది ఉద్యోగులు కూర్చొని పని చేసే సామర్థ్యంతో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, ఇంటెల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజాతో పాటు పలువురు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ అభివృద్ధికి జయేష్ రంజన్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.
ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. ఎలక్ర్టానిక్స్ మానిఫ్యాక్చరింగ్ రంగంలో వచ్చే నాలుగేళ్లలో మూడు లక్షల ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏప్రిల్లో టీ వర్క్స్ ఆవిష్కరిస్తాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Tags booming hyderabad it kcr ktr ktrtrs sector slider telangana governament telangana it minister trs governament trswp