టాలీవుడ్ సూపర్ స్టార్ .. అగ్రహీరో మహేష్ బాబు హీరోగా .. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా తెరకెక్కిన మూవీ సరిలేరు నీకెవ్వరు.
ఈ మూవీ నిన్న శనివారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. మొదటి షో నుండే ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలో అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో మొదటి రోజే మొత్తం రూ.32.77కోట్ల షేర్ రాబట్టుకుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
నిజాంలో రూ.8.66కోట్లు… సీడెడ్ లో రూ.4.15కోట్లు.. వైజాగ్లో రూ.4.04కోట్లు.. గుంటూరులో రూ.5.15కోట్లు.. కృష్ణాలో రూ.3.07కోట్లు వసూలు చేసింది. ఇక నెల్లూరులో రూ.1.27కోట్లు… తూర్పు గోదావరి జిల్లాలో రూ.3.35కోట్లు.. పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.2.72కోట్లు సాధించింది. ఇక అమెరికాలో మొత్తం రూ.5.39కోట్లు కొల్లగొట్టింది.