Home / ANDHRAPRADESH / 5ఏళ్లల్లో వేలకోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబు

5ఏళ్లల్లో వేలకోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్షపార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల అధికారంలో కొన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని మాజీ మంత్రి,వైసీపీ ప్రధాన కార్యదర్శి సి రామచంద్రయ్య ఆరోపించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” విభజన తర్వాత నమ్మకంతో ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించి.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే .. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల వేల కోట్ల అవినీతికి బాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ నేతలు పాల్పడ్డారని ఆయన అన్నారు.

ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం..నమ్మకం లేకపోవడం.. నీతి నిజాయితీలేకపోవడం వలన బాబును గత ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారు. తన అవినీతి సొమ్మునంతా గత సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు చేశారు. ఒక్క ఏపీలోనే కాకుండా కాంగ్రెస్ తో జతకల్సి కొన్ని రాష్ట్రాలకు కూడా ఆ అవినీతి సొమ్మును తరలించారని ఆయన ఆరోపించారు.

గత కొన్ని రోజులుగా జరిగిన ఐటీ దాడుల్లో తెలుగుతమ్ముళ్లు,బినామీలు పక్కా ఆధారాలతో దొరికిపోవడం వలన చంద్రబాబు వాటిపై మాట్లాడానికి భయపడుతున్నారు అని ఆయన ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన కుంభకోణాలు, అవినీతి కార్యాలు, ప్రజా విద్రోహ కార్యక్రమాలు బట్టబయలై జైలుకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. బాబు అవినీతి ఆరోపణలపై కేంద్ర సంస్థలు దృష్టి సారించాలని ఆయన ఈ సందర్భంగా కేంద్ర్త ప్రభుత్వానికివిజ్ఞప్తి చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat