మానవ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా.. తెలంగాణ ప్రజల్ని కూడా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 1096 కరోనా పాజిటవ్ కేసులు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. మొత్తం 628 మంది డిశ్చార్జి అయ్యారని.. మంగళవారం 43 మంది పేషెంట్లు డిశ్చార్జి అయ్యారన్నారు. మంగళవారం 11 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 439 మంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. చాలా కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నామన్నారు. ఇండియాలో మొదటగా కరీంనగర్లో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశామని కేసీఆర్ తెలిపారు.
‘‘తెలంగాణలో డెత్ రేట్ 2.64శాతం, రికవరీ రేట్ 57.3శాతం. తెలంగాణలో అధికారుల కృషి ఇలాగే కొనసాగాలి. కరోనా కనిపించని శత్రువు, ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలి. కరోనాను జీరోకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రజలందరూ లాక్డౌన్కు సహకరించాలి. వివిధ జబ్బులతో చికిత్స పొందుతున్నవారు బయటకు రావొద్దు.’’ అని కేసీఆర్ సూచించారు.