వచ్చే నెల రెండో తారీఖు వినాయక చవితి అని మనకు విదితమే. అయితే ఈ క్రమంలో వినాయక చతుర్థి వచ్చిందంటే భక్తులందరిలోనూ ఎక్కడలేని ఆనందం. శిల్పులు అనేక రూపాల్లో ఆయన విగ్రహాలు మలుస్తుంటారు. విభిన్న రూపాల్లో, ఆకర్షణీయ రంగుల్లో ఆ విఘ్ననాథుడిని రూపొందిస్తారు. కానీ, పట్టణంలోని ఓ పాఠశాలలో మాత్రం వినాయక చతుర్థి రాకముందే గణేశుడు వెలిశాడు. అది కూడా ప్రకృతికి అనుగుణంగా, ఆకట్టుకునే విధంగా. బచ్పన్ స్కూల్లోని ఆవరణలో కొబ్బరి …
Read More »మేడారం సమ్మక్క-సారక్క జాతర పై రివ్యూ మీటింగ్
వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేది నుండి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగే జన జాతరను కుంభమేళను తలపించే విధాలుగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారు మాట్లాడుతూఈ జాతరకు ఎంతో మహోన్నత చరిత్ర కలిగి, రెండు సంవత్సరాలకు ఒక సారి నిర్వహించే సమ్మక్క- సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతి పెద్ద …
Read More »రంజాన్ మాసంలో ముస్లీంలు ఎందుకు ఉపవాసం పాటిస్తారు.?
రంజాన్ మాసం ముస్లీంలు అత్యంత పవిత్రంగా భావించే నెల. చంద్రమాన కాలమానం పాటించే ముస్లీం ప్రజలు సరిగ్గా నెల వంక (చంద్రవంక)ను చూస్తూ ప్రారంభమయ్యే రంజాన్ మాసం ముస్లీంలకు పరమ పవిత్రమైనది. ముస్లీం ప్రజలు రంజాన్ మాసాన్ని వరాల వసంతంగా, అన్నీ శుభాలను ప్రసాదించే నెలగా సంబోధిస్తారు. పూర్తిగా నెల రోజుల పాటు అల్లాను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక రంజాన్ పర్వదినం అనగానే అందరికీ గుర్తుకొచ్చే విషయం …
Read More »గీసుగొండ జాతరకు పోటెత్తుతున్న భక్త జనం
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుగొండ లక్ష్మినరసింహస్వామి జాతరకు జనం పోటెత్తుతున్నారు. ప్రతి ఏడాది జనవరిలో వచ్చే పౌర్ణమిలో ఈ జాతరకు వరంగల్ జిల్లాలోని భక్తులే కాకుండా పొరుగున ఉన్న ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ నుంచి సైతం భక్తులు విచ్చేస్తున్నారు. సమ్మక్క జాతరకు వెళ్లే వారు లక్ష్మీనరసింహుడిని దర్శించుకునే ఆనవాయితి ఉన్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరింంచి …
Read More »భోగి, సంక్రాంతి, కనుమ పండుగలపై దరువు పాటకుల కోసం ప్రత్యేకంగా
ఉత్తరాయణ పుణ్యకాలంలో మార్గశిర, పుష్యమాసాల్లో సంక్రాంతి వస్తుంది. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోనికి వస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రమణం లేదా మకరసంక్రాంతి అంటారు. మన పూర్వులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణమనీ, దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షిణాయణమనీ అన్నారు. సంక్రమణ అంటే ఒకచోటి నుంచి మరో చోటికి జరిగే …
Read More »బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కందిపప్పు, కంపు కొట్టే నెయ్యి చంద్రబాబును నిలదీస్తున్న మహిళలు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు చులకనగా కనిపిస్తున్నారు. బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కంది పప్పు, కంపు కొట్టే నెయ్యి ఇదీ చంద్రన్న సంక్రాంతి కానుకల పేరుతో నాలుగేళ్లుగా సంక్రాంతి కోసం బాబు పంపే సరుకుల తీరు.. రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీకి మంగళం పాడిన చంద్రబాబు సంక్రాంతి పండక్కి మాత్రం చంద్రన్న కానుకల పేరుతో హడావిడి చేస్తున్నారు. కానీ నాణ్యతతో కూడిన సరుకులు పంపిణీ చేసిన పాపానపోలేదు. ఇచ్చిన సరుకుల్లోనూ …
Read More »జల్లికట్టు తరహాలోనే కోడిపందాలకు అనుమతి ఇవ్వాలి..
ఆంధ్రాలో సంక్రాంతి పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చే వాటిల్లో రంగవల్లులు, గోబ్బిళ్లు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, కోడి పందాలు.ఇక కోడి పందాలు అంటారా… తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు కోడి పందాలకు పెట్టిందే పేరు అని ప్రతి ఒక్కరికీ తెలిసిందే.ఈ పందాలకు అధికారికంగా అనుమతి లేకపోయినా, పండగ రోజుల్లో మాత్రం ప్రజలు అనధికారికంగానే అయినా, చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరమైనా కోడి పందాలకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరుతున్నారు.ఈ …
Read More »చైనాలో మొదటిసారి ఘనంగా బతుకమ్మ పండుగ
తెలంగాణ పూల పండుగ “బతుకమ్మ” మరియు దీపావళి వేడుకలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ షాంఘై మరియు షాంఘై దక్షిణ సంగమం షాంఘైలో నవంబర్ 4 న అట్టహాసంగా జరుపుకొన్నారు.అంతేగాక తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పండుగ గురించి మరియు దాని ప్రాముఖ్యత గురించి వీడియో ప్రదర్శన చేశారు. తెలుగు రాష్ట్రాల మహిళలు మరియు దక్షిణ ప్రాంతాల నుండి తెలుగు వారు కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సుజౌ & …
Read More »దీపావళి రోజు రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే కాల్చాలి…సుప్రీంకోర్టు స్పష్టీకరణ
పటాకుల వినియోగం, విక్రయాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. వాటి వినియోగాన్ని నిషేధించలేమని, అయితే కొన్ని షరతులు వర్తిస్తాయని స్పష్టంచేసింది. దీపావళిలాంటి పర్వదినాల్లో దేశవ్యాప్తంగా రాత్రి రెండుగంటలు మాత్రమే పటాకులు కాల్చాలని స్పష్టంచేసింది. అన్ని మతాల పండుగలకు, శుభకార్యాలకూ తమ తీర్పు వర్తిస్తుందని తెలిపింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలప్పుడు అర్ధరాత్రి వేళ 35నిమిషాలపాటు పటాకులు పేల్చేందుకు అనుమతినిచ్చింది. ఆన్లైన్లో పటాకుల అమ్మకాలపై నిషేధం విధించిన సర్వోన్నత న్యాయస్థానం.. …
Read More »