ఇటీవలే ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ పార్టీ మాజీ నేత రేవంత్ రెడ్డికి ఇప్పుడప్పుడే పదవి కట్టబెట్టే అవకాశాలు లేవా? అంటే అవుననే అంటున్నారు.రేవంత్ రెడ్డికి ఆ పదవిపై హామీ ఇవ్వలేదా? ఈక్వేషన్ తగ్గించాడు .కానీ రేవంత్ రెడ్డి చేరికను చాలామంది కాంగ్రెస్ నేతలు స్వాగతిస్తున్నారు.
కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఉండటం, వచ్చీ రాగానే ఆయనకు పదవి ఇవ్వడం ఏమిటని కొందరు వాపోతున్నారు.కొందరు కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి నేపథ్యంలో రేవంత్ రెడ్డికి పదవి ఇచ్చే అంశాన్ని కొన్నాళ్లు పక్కన పెట్టాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. కొద్ది రోజుల పాటు ఆయనకు ఏ పదవి దక్కకపోవచ్చునని తెలుస్తోంది.
సీనియర్లతో మాట్లాడి అందరిని చల్లబరిచిన తర్వాత ఆయనకు పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆయన పార్టీలో చేరగానే కొద్ది రోజుల్లో పదవి వస్తుందని భావించారు. కానీ ఇప్పుడు సీనియర్లను చల్లబరిచాక ఇవ్వాలని భావిస్తోంది ఆ పార్టీ అధిష్టానం .