తెలంగాణ టీడీపీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు .కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న తర్వాత శనివారం ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ మహానగరంలోని గాంధీభవన్ లో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి .ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే కేసీఆర్ మోసం చేశారు .ఇంటికో ఉద్యోగం ఇస్తా అని హామీ కురిపించి దాన్ని విస్మరించాడు .
అధికారంలోకి వచ్చి మూడున్నర ఏండ్లు అయిన కానీ పలు విభాగాల్లో ఖాళీ ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు .తాజాగా రేవంత్ రెడ్డి బాటలో టీడీపీ ఎమ్మెల్యే ,బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య నడిచారు .శనివార హైదరాబాద్ లో చైతన్యపురిలో జరిగిన నిరుద్యోగి జాక్ సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తాను అని అన్న ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి .
లేదా ఉద్యోగం ఇచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు .అయితే ఇంటికో ఉద్యోగం ,ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో కురిపించిన హామీలు అనే సంగతి ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రజలకు తెల్సిన ..అదే పార్టీ తరపున గెలిచి నిన్న మొన్నటి వరకు పనిచేసిన వీరిద్దరికీ తెలియకపోవడం ఆశ్చర్యకరం ..