వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటానికి మధ్య ఉన్న గత ఎన్నికల్లో ఉన్న ఓట్ల తేడా కేవలం రెండు శాతమే ..అది కూడా అక్షరాలా ఐదు లక్షల ఓట్ల తేడా మాత్రమే. అయితే కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు .
ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటె బాగా పనిచేస్తాడు .ప్రజల సమస్యలను తీరుస్తాడు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగా ఇచ్చిన మాటపై నిలబడి ఉండే మనస్తత్వం ఉన్న నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి .
జగన్మోహన్ రెడీకి ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి .ప్రజలే జగన్ ను దీవించాలి .తప్పకుండ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు .