తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో వినూత్న ఉద్యమానికి సిద్ధమయ్యరా ..!.ఇప్పటికే సరిగ్గా పదిహేడు ఏళ్ల కిందట ప్రస్తుత నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి టీఆర్ఎస్ పార్టీ స్థాపించి..దాదాపు పద్నాలుగు ఏళ్ళ పాటు ఎన్నో ఉద్యమాలు ..పోరాటాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించి అందరిచేత శబాష్ అనిపించుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కట్టారు.దీంతో గత నాలుగు ఏళ్ళుగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని ఇటు సంక్షేమంలో అటు అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుపుతూ అందరి మన్నలను పొందుతున్నారు.
ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో నిర్లక్ష్యానికి గురైన రైతాంగాన్ని అభివృద్ధి పరచడానికి త్రాగునీటి సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేస్తున్నారు.అందులో భాగంగా పండించిన పంటలకు మద్దతు ధర నిర్ణయించుకోవడానికి..రైతుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి విన్నవించడానికి రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ ను ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి.ఈ క్రమంలో రైతు సమన్వయ సమితి సదస్సులను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్నారు.ఈ తరుణంలో కరీంనగర్ లో జరిగిన సభలో మాట్లాడుతూ కేంద్రంలో ఎవరున్న కానీ రైతాంగానికి చేసింది ఏమి లేదు.
బీజేపీ అధికారంలో ఉంటె కాంగ్రెస్..కాంగ్రెస్ అధికారంలో బీజేపీ వాళ్ళు ధర్నాలు చేయడం మినహా రైతాంగానికి చేసింది ఏమి లేదు.రైతుల జీవితాలు మారలేదు.దేశంలో డెబ్బై శాతం నీరున్న కానీ రైతుల ఆత్మహత్యలు పెరిగాయి తప్పా తగ్గలేదు.ప్రపంచంలో ఐక్యమత్యం లేనిది ఏదైనా ఉన్నదంటే అది రైతాంగం..రైతులందరూ ఐక్యమత్యంగా ఉంటే కేంద్రాన్ని మెడలు వంచడం సులభం.రైతులు కేంద్రంపై ఎదురుతిరిగే రోజులు వస్తాయి.రైతుల బ్రతుకులు మారడానికి తెలంగాణ రైతాంగం నాయకత్వం వహించాలి.అవసరమైతే ఈ పనిని తెలంగాణ తీసుకుంటుంది.రైతుల గురించి రానున్న బడ్జెట్ సమావేశంలో తమ పార్టీ ఎంపీలు పోరాడతారు.భవిష్యత్తులో దేశ రైతాంగం తలరాత మారుతుంటే నాయకత్వం వహించడానికి ..ఉద్యమాలు పోరాటాలు చేయడానికి తెలంగాణ ఎప్పుడు ముందుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా దేశ రైతాంగానికి సంకేతాలు పంపించారు కరీంనగర్ సాక్షిగా ..