Home / ANDHRAPRADESH / వైసీపీలోకి మ‌రో సీనియ‌ర్ నేత‌..! డేట్ ఫిక్స్‌..!!

వైసీపీలోకి మ‌రో సీనియ‌ర్ నేత‌..! డేట్ ఫిక్స్‌..!!

వైసీపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చే వార్త ..గత నూట నలబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే మరోవైపు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు క్యూ కడుతూ వైసీపీ గూటికి వస్తున్నారు.ఇటీవల అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది అనుచరవర్గంతో వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .

ఇలా, 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ.. ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీలోకి ఇత‌ర పార్టీల నుంచి వ‌ల‌స‌లు జోరందుకున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ల‌డ‌పాటి రాజ‌గోపాల్ వైసీపీలో చేర‌నున్నారా..? అందుకు ముహూర్తం కూడా ఖ‌రారైందా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అందుకు కార‌ణాలు కూడా లేక‌పోలేదు మ‌రీ. ఆ కార‌ణాల‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే రాజకీయ విశ్లేష‌కుల మాట వాస్త‌వ‌మ‌నే చెప్పొచ్చు.

see also : చంద్ర‌బాబు గుట్టు.. బ‌ట్ట బ‌య‌లు..!!

ఇక అస‌లు విష‌యానికొస్తే.. ఇటు రాష్ట్రంలోను.. అటు దేశంలోనూ ఎన్ని స‌ర్వే ఏజెన్సీలు ఉన్నా మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వేవైపే ప్ర‌జ‌లు విశ్వ‌స‌నీయ‌త చూపుతార‌ని చెప్పొచ్చు. అంత‌లా నిక్క‌చ్చిగా ఉంటాయి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వేలు. అంతేకాకుండా ల‌గ‌డ‌పాటి చెప్పిన స‌ర్వేలు చాలా వ‌ర‌కు నిజ‌మ‌య్యాయి కూడాను. పార్ల‌మెంటులో ఆయ‌న‌ది ఓ ప్ర‌త్యేక స్థానం అని చెప్పుకోక త‌ప్ప‌దు. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం జ‌రిగిన 2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో రాజ‌గోపాల్ పోటీ చేయ‌క‌పోగా.. కొంత‌కాలంగా క్రియాశీల రాజ‌కీయాల‌కు రాజ‌గోపాల్ దూరంగా ఉన్నారు.

see also : పవన్ కళ్యాణ్ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు …!
అయితే, ఏపీలో తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నార‌ని స‌మాచారం. అస‌లే ఏపీలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం ఇప్ప‌టికే వేడెక్కింది. ఈ నేప‌థ్యంలో 2019 ఎన్నిక‌ల నాటికి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరి విజ‌య‌వాడ నుంచి లోక్ స‌భ స్థానానికి పోటీ చేయాల‌ని నిశ్చ‌యించుకున్నార‌ట‌.

see also : నాని నోరు అదుపులో పెట్టుకో -వల్లభనేని వంశీ ..!

మ‌రోవైపు వైసీపీ గ్రామ స్థాయిలో బ‌లం పుంజుకోవడంతోపాటు తాజాగా ప‌లు సంస్థ‌లు చేసిన‌ స‌ర్వేల్లోనూ 2019లో వైఎస్ జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌డ‌తారంటూ ఫ‌లితాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఏకంగా అటు మోడీ, ఇటు చంద్ర‌బాబుల అనుకూల మీడియా దిగ్గ‌జాలు నిర్వ‌హించిన స‌ర్వేలోనూ 2019లో జ‌గ‌న్‌కే సీఎం పీఠం అన్న విష‌యం వెల్ల‌డైంది. ఇప్ప‌టికే టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌, నాయ‌కుల వ్య‌వ‌హార శైలితో గ్రామ‌స్థాయిలో ప‌టిష్ట‌త‌ను కోల్పోయింద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఈ నేప‌థ్యంలో ల‌గ‌డ‌పాటి స‌ర్వేలోనూ జ‌గ‌నే సీఎం అని తేల‌డంతో… ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat