ఏపీలో అధికార టీడీపీ కి చెందిన నేతల అరాచకాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి.ఈ క్రమంలో సాధారణ మహిళ దగ్గర నుండి ప్రభుత్వ మహిళ అధికారి వరకు ..సామాన్య పౌరుడుదగ్గర నుండి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల వరకు ఎవర్ని వదిలిపెట్టకుండా టీడీపీ నేతలు అందరిపై దాడులకు తెగబడుతున్నారు .
తాజాగా రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా పరిషత్సమావేశం సందర్భంగా అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ,శాసనమండలి విప్ రెడ్డి సుబ్రహ్మణ్యం వైసీపీ పార్టీ కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పై దాడికిదిగారు.పరిషత్ సమావేశంలో గోపాలపురం ఇసుక ర్యాంపు అవినీతిపై ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అధికార పార్టీని ప్రశ్నించారు .
దీంతో కోపంతో ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం బండబూతులుతిడుతూ ..నేమ్ ప్లేట్స్ ,వాటర్ బాటిల్స్ ను విసిరేశాడు.ఈ ఘటనతో మిగిలినవారు అవాక్కయ్యారు .సాక్షాత్తు ఎమ్మెల్యేపైనే అధికార టీడీపీ నేతలు దాడులు చేస్తుండటంతో రాష్ట్రంలోసామాన్యుల పరిస్థితి ఏమిటో అర్ధం చేస్కోవచ్చు అని అందరు వ్యాఖ్యానిస్తున్నారు ..
Post Views: 270