మలయాళంలో దుల్కర్ సల్మాన్ నటించిన ఏబీసీడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ హక్కులను కొనుగోలు చేశాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వారబ్బాయి అల్లు శిరీష్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు డేట్స్ను కూడా ఫిక్స్ చేసేశారు. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో హీరోయిన్గా కృష్ణార్జున యుద్ధంలో నాని సరసన నటించిన రుక్షర్ దిలోన్ను ఎంపిక చేశారంట. అల్లు శిరీష్ ఈ చిత్రంతోపాటు తమిళంలో హీరో సూర్య, కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ నటించనున్నాడు. ఆ చిత్రంలో మోహన్లాల్ కూడా ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు.