టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్ రాజు కుమారుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సుమంత్ అశ్విన్. తనకు సూటయ్యే పాత్రలను ఎంచుకుంటూ.. తనదైన నటనా శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఒక్కో చిత్రంతో.. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. నటుడిగా రాణిస్తున్నాడు.
2012లో తూనీగా.. తూనీగా చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అశ్విన్, కేరింత, కొలంబస్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.
ఇదిలా ఉండగా, అశిన్, మెగా డాటర్ నిహారిక కలిసి నటించిన తాజా చిత్రం హ్యాప్పీ వెడ్డింగ్, ఇటీవల విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కాగా, సుమంత్ అశ్విన్కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, హ్యాప్పీ వెడ్డింగ్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న నిహారికపై సీతాకోక చిలుక టాటూ ఒకటి దర్శనమిచ్చింది. ఆ టాటూ వైపు సుమంత్ అశ్విన్ తదేకంగా చూస్తూ ఉండిపోయిన దృశ్యం ఒకటి కెమెరామెన్ కంట పడింది. అలా ఆ కెమెరామెన్ క్లిక్మనిపించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.