Home / 18+ / టీడీపీతో పొత్తే మమ్మల్ని ముంచింది…

టీడీపీతో పొత్తే మమ్మల్ని ముంచింది…

కూటమి పేరుతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు మంచిది కాదన్న వాదన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మొదలైంది. ఓటమి నుంచి తేరుకుంటున్న కాంగ్రెస్‌… టీడీపీతో పొత్తు కొనసాగితే తెలంగాణలో పార్టీ భవిష్యత్‌ ప్రశ్నార్థకమవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో టీడీపీతో పొత్తుపై చర్చనియాంసంగా మారింది.లోక్‌సభ ఎన్నికల్లోనూ టీడీపీతో పొత్తు ఉంటే… తెలంగాణలో మనుగడ సాగించలేమని, పోటీ చేసేందుకు నాయకులు ముందుకు రారని సీనియర్లు అంటున్నారు.శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్‌ అధినాయకత్వానికి తెలుసునని, తరువాత ఎన్నికలకు వ్యూహం ఎలా ఉండాలన్నది కూడా వారికి తెలియదని అనుకోవడం లేదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఒకరు అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకంటే టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు ఈ ఎన్నికలను హైజాక్‌ చేయడం వల్లే ప్రజల్లో తమ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు తమపై ఉన్న సానుభూతి బాబుతో పొత్తు పెట్టుకున్నాక ఆగ్రహంగా మారిందని కాంగ్రెస్‌ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. కేవలం సీపీఐ, తెలంగాణ జనసమితితోనే పొత్తుకు పరిమితమై ఎన్నికలకు వెళ్లుంటే సీట్ల సర్దుబాటులో కూడా సమస్యలుండేవి కావనీ, కనీసం మరో 20 సీట్లలో మెరుగైన ప్రతిభ సాధించగలిగేవారమని అంటున్నారు.హైదరాబాద్‌ను తానే కట్టానని ఓసారి, తాను చేసిన దాన్ని కాంగ్రెస్‌ పార్టీ కొనసాగించిందని మరోసారి చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు… తన రాకను వ్యతిరేకిస్తున్న తెలంగాణ సమాజానికి సమాధానం ఇవ్వడం మాత్రం మర్చిపోయారని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంతోపాటు కూటమిలో అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఆయనకు ఇచ్చినట్లు బహిర్గతం కావడమే తమ కొంప ముంచిందని వాపోతున్నారు.‘మంచో చెడో ఓసారి పొత్తు పెట్టుకున్నాం. దాని పర్యవసానాలు అనుభవించాం. ఇకనైనా తెలంగాణ ప్రజల మనసెరిగి వ్యవహరిస్తే బాగుంటుంది’అని టీపీసీసీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రవీంద్ర నాయక్‌ అన్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat