Home / 18+ / ప‌వ‌న్ గుర్తుపై శ్రీ‌రెడ్డి సెటైర్లు..

ప‌వ‌న్ గుర్తుపై శ్రీ‌రెడ్డి సెటైర్లు..

సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయించింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన 2019 ఎన్నికలలో ఈ గ్లాస్ చిహ్నాంతో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. వచ్చే సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు వర్తించనుంది. గాజు గ్లాసు గుర్తు సులువుగానే ప్రజల్లోకి వెళ్తుంది.

అయితే, ఈ గుర్తుపై వివాదాస్ప‌ద న‌టి శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌కు ద‌క్కిన గుర్తు సామాన్యుడి తాగే టీ గ్లాస్ ని పోలి ఉందని, ఇది సామాన్యుడి గుర్తు అంటూ జనసేన హర్షం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఆ పార్టీ గుర్తుపై నటి శ్రీరెడ్డి చేసిన ఘాటు కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేన పార్టీని, పవన్ సోదరుడు నాగేంద్ర బాబును విమర్శిస్తూ ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో ”అరె.. జనసేన పార్టీ గుర్తు గలాసు అంటగా.. అది బీరు గ్లాసా..? వైన్ గ్లాసా..? స్కాచ్ గ్లాసా..? అని వ్యంగ్యంగా రాసింది. అంతటితో ఆగకుండా నాగబాబు గారికి కూడా ఓ గ్లాస్ ఇవ్వండర్రా.. అసలే రీసెంట్ గా కొత్త గొంతు వచ్చిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నాడో.. అర్ధం కావట్లేదు” అంటూ రాసుకొచ్చింది. కాగా, శ్రీరెడ్డి చేసిన పోస్టుపై పవన్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. జనాలకు ఈ గాజు గ్లాసులో టీ కనిపిస్తుంటే.. శ్రీరెడ్డికి మాత్రం మద్యం కనిపిస్తుందంటూ విరుచుకుప‌డుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat