వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమర శంఖారావం నలుదిక్కులా ప్రతిధ్వనిస్తోంది. అన్నొస్తున్నాడని చెప్పండీ అంటూ జగన్ ఇచ్చిన పిలుపు లక్షలాది అభిమానులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. తమ నాయకుడు ప్రతిపక్ష నేత ఓ రాక్ స్టార్ లా ఉన్నాడంటున్నారు ఆయన అభిమానులు.. బహిరంగ సభలో వేలాది మంది ప్రజానీకం మధ్య నుంచి నడిచేలా, వారితో సంభాషించేలా ఏర్పాటు చేసిన కారిడార్ లో జగన్ నడుస్తూ ముందుకు వెళ్లడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.. సీఎం చంద్రబాబులా చుట్టూ ఏసీలు పెట్టుకుని చెమట చుక్క చిందకుండా ఉపన్యాసాలు ఇచ్చే మాటల నాయకుడు తమ నాయకుడు కాదని, మెత్తటి పరుపులు వేసుకుని, సొగసైన కుర్చీల్లో విలాసంగా కూర్చునే వ్యక్తి కాదంటున్నారు జగనభిమానులు. జగన్ మధ్యలోకే నడిచి వెళ్లారు.
వారి ప్రశ్నలు అందుకుని జవాబులిచ్చారు. చిరునవ్వుతో, స్థిరమైన మాటతో, అతి సామాన్యంగా, సాదాసీదాగా, అందరిలో ఒకడనిపించేలా ఉన్న వైఎస్ జగన్ ను చూసి ఇతడే అసలైన రాక్ స్టార్ అంటున్నారు అభిమానులు. ప్రజల మనసులు గెలిచిన జగన్ కూడా రాక్ స్టారే అంటున్నారు ఆయన ఫ్యాన్స్.. రాజకీయాల్లో రోల్ మోడల్ గా, వ్యక్తిత్వంలో ఒకే ఒక్కడిగా, ప్రజాభిమానంలో జగన్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. దేశంలో ఏ నాయకుడు పడనంత కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడుతూనే ప్రజలకోసం నిరంతరం పోరాడుతున్నారు.