Home / 18+ / ట్విటర్‌ వేదికగా చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు…ఎంపీ విజయసాయిరెడ్డి

ట్విటర్‌ వేదికగా చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు…ఎంపీ విజయసాయిరెడ్డి

దీక్షతో ఢిల్లీలో హడావిడి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రబాబు, తనయుడు లోకేష్‌ను ఏకిపారేశారు. నల్ల చొక్కాలు జాగ్రత్తగా దాచుకోండి చంద్రం సారూ. రేపు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇంత అన్యాయమైన తీర్పిచ్చారని ప్రజలకు నిరసన తెలపాలి కదా. ఈ చొక్కాల్లో అమావాస్య రాత్రి దొంగతనాలకు బయల్దేరే బందిపోట్లలా కనిపిస్తున్నారు మీ టీడీపీ తమ్ముళ్లు.. అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు దీక్ష పరీక్షలకు గంట ముందు పిల్లలు సిలబస్‌ చదవడం లాంటిదన ఆఖరి నిమిషం దీక్ష వల్ల ఆయనకూ, రాష్ట్రానికి ఏ ప్రయోజనం లేదన్నారు. చంద్రబాబును మించిన అవకాశవాది దేశంలో ఎక్కడా కనిపించరని మండిపడ్డారు.

 

 

దోచుకోవడానికే కేంద్ర ప్రాజెక్టు పోలవరాన్ని తనే నిర్మిస్తానని చంద్రబాబు తీసుకున్నాడని ఏడాది క్రితం కాంగ్రెస్‌ నేత జయరాం రమేశ్ తిట్టిపోశాడని, కానీ ఇవ్వాళ ఆ ఇద్దరు ఆలింగనాలు చేసుకుంటుంటే ఇంత దిగజారుడుతనమా అన్నారు. చంద్రబాబు ఎలాంటివాడో మాజీ ప్రధాని దేవెగౌడకు బాగా తెలుసనిన్నారు. ఇక డబ్బాకొట్టుకోవడంలో చిట్టినాయుడు లోకేష్‌ తండ్రిని మించిపోయాడని, తండ్రి గాంధీ మహాత్ముడి అంతటి వాడినని డబ్బా కొట్టుకుంటుంటే కొడుకేమో ప్రపంచ బ్యాంక్ లో అతిపెద్ద ఉద్యోగం వదులుకొని ప్రజాసేవ కోసం వచ్చానని అంటున్నాడని తెలిపారు. చంద్రబాబు ఢిల్లీ దొంగ దీక్షను ఎవరూ పట్టించుకోకపోయినా కులమీడియా తెగ హైరానా పడుతుందని విమర్శించారు. బులెటిన్ల నిండా దీక్ష విజువల్సే.. మళ్లీ స్పెషల్ ప్రోగ్రాంలతో తమ జాతిపిత రుణం తీర్చుకుంటున్నాయని, ఈ పబ్లిసిటీ గోల చూడలేక జనాలు చానళ్లు మార్చుకుంటున్నారని విమర్శించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat