ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ముందు టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ,జనసేన పార్టీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులందరూ చిత్తు చిత్తుగా ఓడిపోయిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి వైసీపీ తరఫున సీఐ అయిన గోరంట్ల మాధవ్ బరిలోకి దిగిన సంగతి తెల్సిందే.
ఈ ఎన్నికల్లో గోరంట్ల మాధవ్ కు మొత్తం 6 లక్షల 99 వేల 739 ఓట్లు వచ్చాయి.ఆయన ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పకు 5 లక్షల 61 వేల 602 ఓట్లు వచ్చాయి. లక్షా 38 వేల 137 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు మాధవ్.ఈ క్రమంలో జనసేన తరపున బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సైతం ఘోరంగా ఓటమి పాలయ్యారు.
అందరి దృష్టి ఆకర్షించిన విశాఖ లోక్ సభ జనసేన అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. మూడో స్థానానికి పరిమితం అయ్యారు. .దీనిపై నెటిజన్లు సెటైర్లు కురిపిస్తోన్నారు. సీఐగా మాధవ్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందితే సీబీఐ మాజీ జేడీ అయిన లక్ష్మీనారాయణ మాత్రం లక్ష ఓట్లతో ఓడిపోయాడంటూ సెటైర్లు వేస్తోన్నారు నెటిజన్లు..