Home / ANDHRAPRADESH / జగన్”సంచలన” నిర్ణయం..!

జగన్”సంచలన” నిర్ణయం..!

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తర్వాత రోజు నుండి ఇటు పాలనలో అటు గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆరు నెలల్లోనే బెస్ట్ సీఎంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటాను అని హామీచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా అడుగులు వేస్తోన్నారు.

అందులో భాగంగా సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కేబినెట్లో ఒక్కరికి కాదు ఇద్దరికీ కాదు ఏకంగా ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తానని ఆయన ప్రకటించేశారని వార్తలు వస్తోన్నాయి.. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీం,కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం.

అయితే రెండున్నరేళ్ల తర్వాత ప్రస్తుతం కొలువ దీరనున్న జగన్ మంత్రి వర్గంలో తర్వాత జరిగే విస్తరణ జరిగేటప్పుడు తొంబై శాతం మంత్రులను మార్చాలని ఆయన ఆలోచిస్తోన్నారని సమాచారం. ఇక ఈ నెల ఎనిమిదో తారీఖున కొలువై ఉండనున్న మంత్రి వర్గంలో యాబై శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలకు అవకాశముందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat