ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందట.. ముఖ్యంగా గెలిచిన ఎమ్మెల్యేలకంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంతో ఆనందంగా ఉన్నారట.. గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం బాధపడుతున్నారట.. ఎందుకో తెలుసా.? దానికి తాజాగా సీఎం జగన్ ఇచ్చిన స్టేట్ మెంటే కారణం.. రాజకీయంగా పార్టీలు ఎవరైనా మారొచ్చు.. అయితే రాజ్యాంగబద్ధంగా మారాలి. ఇదే విషయం జగన్ చెప్తూ ఎవరైనా తెలుగుదేశం ఎమ్మెల్యేలు తన పార్టీలోకి వస్తే కచ్చితంగా రాజీనామా చేసి రావాలని కోరారు. అయితే ఓడిపోయిన ఎమ్మెల్యేలు మాత్రం వైసీపీలోకి నేరుగా వచ్చేయవచ్చు. వచ్చి పార్టీకి సేవ చేసినా, పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నా వారికి ఇప్పుడు కాకపోతే మరో యేడాదిలోపు ఏదోవిధంగా రాజకీయ లబ్ధి చేకూరే అవకాశం ఉంది.
అయితే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం కచ్చితంగా రాజీనామా చేయాలి.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి.. అదంతా పెద్ద ప్రోసెస్.. పైగా అందుకు గట్స్ కావాలి.. అయితే ఇప్పటికే కొందరు వైసీపీలోకి రావాలని ప్రయత్నిస్తున్నారట.. వీరంతా రాజీనామా చేసి పార్టీ మారతారు కాబట్టి కచ్చితంగా మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం.